Events

Prajagalam Meeting In Guntur
May 1, 2024    

Prajagalam Meeting In Guntur

Tags: No Categories
01 May
May 1, 2024    

Madam Tenali Meeting

Tags: No Categories
Dr Pemmasani's Public Programs
May 1, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Vaderulla Atmiya Samavesam
April 30, 2024    

Vaderulla Atmiya Samavesam

అవినీతి పాలన. + జగన్ ప్రభుత్వం పై బీసీ సమావేశంలో పెమ్మసాని విమర్శలు. ‘యావన్మంది వైసీపీ నాయకులు అవినీతి పరులుగా మారారు. చిలకలూరిపేట నుంచి వచ్చిన రజిని అక్రమ వసూలలో రికార్డు సృష్టించగా, అఖిలార్ రోశయ్య అక్రమ మైనింగ్ తో వేలకోట్లు వెనకేసుకున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏ-వన్ కన్వెన్షన్ హాల్లో బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ… పెమ్మసాని చంద్రశేఖర్ గారు: ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి నుంచి పోటీ చేస్తున్న విడుదల రజనీ గారికి ఏ అర్హత లేకపోయినా వైద్య శాఖ మంత్రిగా ఎలా నియమించారు? దళితుల కు చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించడం వల్ల ఆమెకు మంత్రి పదవి వచ్చింది. అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ వైద్యం అందించే డాక్టర్లను కూడా కొందరు అవినీతిపరులు వేధిస్తున్నారు. అదేమని అడిగితే ఫీజులు పెంచమని, పెంచిన ఫీజులను ప్రజలపై మోపమని సలహా ఇస్తున్నారు. పథకాలు ఇస్తున్నారు కదా! అని ఈ వైసీపీ నాయకులకు ఓట్లు వేస్తే ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి ప్రజలను వేధిస్తుంటారు. మరోవైపు వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న కిలారు రోశయ్య ప్రజలకు సంబంధించిన 700 ఎకరాల్లో అక్రమ గ్రావెల్ తవ్వి, అవినీతి సంపాదనకు పాల్పడ్డారు. ఈ ఇద్దరు నాయకులు అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్నారు. కానీ నేను కష్టాలను చూస్తూ పెరిగాను. కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చి, మీ ఎదురుగా ఇలా నిలబడగలిగాను. * ఎక్కడెక్కడ పనులు దొరికితే అక్కడకు పిల్లలతో సహా వెళ్లి పనులు చేసుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తులు మీరు. చదవకపోయినా ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల వంటి గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తులు మీరు. గడచిన ఐదేళ్లుగా ఆదాయాలు పెరగకపోయినా నిత్యవసరకుల ధరలు, పెట్రోలు, ఇతర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసే కొంతమంది కార్మికులు సాయంత్రానికి కొంచెం మద్యం తీసుకుందామంటే అవి కాస్తా ప్రాణాంతకమైన రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. ఇవాళ, రేపు ఒక తోపుడు బండి పైనా డిజిటల్ పేమెంట్లు జరుగుతుంటే, ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్ లకు ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది. నివాసాలు లేనివారికి ఇల్లు కల్పించడం లేదా టిట్కో నివాసాలు అందించడం వంటి సహకారాలు అందిస్తాం. పిడుగురాళ్ల మాధవి: గడిచిన ఐదేళ్లలో ఈ జగన్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. క్వారలను అన్యాక్రాంతం చేస్తూ తమ పార్టీ నాయకులకు ఈ వైసిపి ప్రభుత్వం కట్టబెట్టింది. వడ్డెర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి, వందల కోట్లను కేటాయించిన టిడిపి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ను కేటాయించి నయా పైసా నిధులు ఇవ్వకుండా అవమానిస్తుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వడ్డెరలను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తున్నారు. ఒక అసమర్థుడైన, అవినీతిపరుడైన నాయకుడు చేతిలో ఇటుక రాయి ఉంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ప్రజల తలలు పగల కొడుతుంది. అదే సమర్ధుడైన నాయకుడు చేతిలో పెడితే ఒక నూతన నిర్మాణానికి నాంది పలుకుతుంది. అందరికీ మంచి చేయాలని వచ్చిన పెమ్మసాని గారి వంటి నాయకులు, చట్ట సభల్లో గళం విప్పాలనుకునే నా వంటి వారిని గెలిపిస్తే, అభివృద్ధికి బాటలు వేస్తాం. * ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, పశ్చిమ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి బాబు, టిడిపి జిల్లా పార్టీ కన్వీనర్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Prajagalam Meeting at Tenali
April 30, 2024    

Prajagalam Meeting at Tenali

తెనాలిలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.
Tags: No Categories
Madam Door to Door Campaigning
April 30, 2024    

Madam Door to Door Campaigning

Tags: No Categories
Madam Door to Door Campaign
April 30, 2024    

Madam Door to Door Campaign

Tags: No Categories
Guntur East Brahmins Athmiya Samvesam
April 30, 2024    

Guntur East Brahmins Athmiya Samvesam

Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 30, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
District Office Meeting
April 30, 2024    

District Office Meeting

ప్రజా గళం విజయవంతం చేద్దాం. టిడిపి కార్యకర్తలతో డాక్టర్ పెమ్మసాని ‘కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం సఫలీకృతమయ్యే సమయం ఆసన్నం అయింది. నేడు జరగబోయే చంద్రబాబు గారి ప్రజా గళం యాత్ర, భారీ బహిరంగ సభను సమిష్టిగా నడిపించి విజయవంతం చేద్దాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. టిడిపి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ ప్రజా గళం యాత్ర నిర్వహణకు అబ్జర్వర్ గా విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఆహ్వానం పలికారు. నాలుగున్నరేళ్ళుగా కార్యకర్తలు, నాయకులు పడుతున్న అవమానాలకు, వేధింపులకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. మరో 10 రోజులు అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తే ఈ అరాచక పాలనకు వీడ్కోలు పలకడం కష్టమేమీ కాదన్నారు. పార్టీలో నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు టిడిపి అండగా ఉంటుందని, ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవడం కష్టమైన పని ఏమి కాదని చెప్పారు. అలాగే హాజీ షేక్ షౌకత్ గురించి మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా టిడిపి పార్టీలో చేరబోతున్నారని పెమ్మసాని తెలిపారు. నేడు బాబు గారు పాల్గొనబోయే ప్రజాగళం భారీ బహిరంగ సభలో ఆయన బాబు గారి చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకుంటారని వివరించారు. అలాగే దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ నేడు జరగబోయే ప్రజా గళం యాత్రకు టిడిపి, బిజెపి, జనసేన నాయకులు విరివిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రచార కార్యక్రమాల నుంచే ప్రజల్లో అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న నాయకులు పెమ్మసాని అని తెలిపారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రాజధాని ప్రాంతానికి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం సాధారణ విషయం కాదని, అలాంటి వ్యక్తిని బాబు గారు ఏరి కోరి ఎన్నిక చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తుని చిట్టిబాబు, టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
2 3 4 5 6 7 8 9 10 11 12 13