Events

Tadikonda Road Show
May 6, 2024    

Tadikonda Road Show

టిడిపి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు. తాడికొండ, ఫిరంగిపురం మండలాల పర్యటనలో పెమ్మసాని ‘ప్రజల ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంచాలి. ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలు జిరాక్స్ కాగితాలతో లావాదేవీలు ఎలా జరుపుతారు. తమ ఆస్తులు ఉన్నాయో! ఊడాయో! ప్రభుత్వం దయతలిస్తే గాని ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి రాదని గ్యారెంటీ ఏంటి?’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ ఫేమస్ అని చంద్రశేఖర్ గారు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ పర్యటనను పెమ్మసాని నిర్వహించారు. పర్యటనలో భాగంగా ముందుగా తాడికొండ మండలం మోతడక, నిడుముక్కల, బడే పురం గ్రామాల్లో, అనంతరం ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్లూరు, ఎర్రగుంట్ల పాడు, బేతపూడి గుండాలపాడు పొనుగుపాడు గ్రామాల్లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ… మన ఇంట్లో మనకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటేనే భయం భయంగా గడుపుతాం. అలాంటిది సొంత ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం చేతులో పెట్టి జిరాక్స్ కాపీలు మాత్రం మనవద్ద పెట్టుకొని ఎలా ధైర్యంగా ఉండగలం? ప్రజలారా ఒకటే చెబుతున్నాను ఈ నెల రోజులు ఎవరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు. టిడిపి ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. కచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం. * ప్రజలు ఓట్లేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు నిలబడ్డ రోడ్లు ఎవరు నిర్మింప చేశారో గుర్తు చేసుకోండి. 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప వైసిపి ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మీలో ఎంతోమంది యువకులు చదువులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారు. కానీ అలా వచ్చిన వారికి ఉద్యోగాలు దొరుకుతున్నాయా లేదా? ఒకసారి ఆలోచించుకోండి. పనిచేసే వారికి డిమాండ్ పెరిగితే రోజుకు రూ. 500-1000లు కంటే ఎక్కువే ఆదాయం రావచ్చు. అప్పుడే మీరు సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలు మెరుగవుతాయి. ఉదయం పూట సంక్షేమం డబ్బులు చేతిలో పెట్టి, సాయంత్రానికి కల్తీ మద్యం పేరిట అంతకు రెట్టింపు సొమ్మును జగన్ ప్రభుత్వం, నాయకులు లాక్కుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఆ బ్రాండ్ లు టిడిపి హయాంలో రిజిస్టర్ అయ్యాయి అంటారు. టిడిపి టైంలో రిజిస్టర్ అయ్యుంటే కల్తీ మద్యం పై అప్పట్లో జగన్ అండ్ కో ఎందుకు ప్రశ్నించలేదు? అని అడుగుతున్నాను. రాజధాని ప్రాంతంలో వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పజెప్పినా ఒక్క రూపాయి అవినీతి లేకుండా శ్రావణ్ కుమార్ గారు పని చేశారు. * సుచరిత గారికి పేరుకు మాత్రమే హోం మంత్రి పదవి ఇచ్చారు తప్ప, అధికారం మొత్తం సజ్జల చేతుల్లోనే ఉంది. ఆమె కుటుంబం మొత్తం కలెక్షన్ల మీదే దృష్టి పెట్టారు తప్ప ప్రజా సంక్షేమం గురించి ఏ రోజు పట్టించుకోలేదు. కానీ శ్రావణ్ కుమార్ గారు ఆయన కుటుంబం ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవబోతోంది. ఇదే వాస్తవం. అనవసరంగా మునిగిపోయే పడవకు ఓటు వేసి మీ ఓట్లను మురిగిపోయేలా చేసుకోవద్దు. బాబు గారితో మేము పేదలకు ఇళ్ళు నిర్మింపజేసి ఇవ్వడం గురించి మాట్లాడాము. మీ ఓట్లు టిడిపికి వేసి గెలిపించండి. ప్రజల ఇంటి సమస్యలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. తెనాలి శ్రావణ్ కుమార్ గారు: మద్యం తాగితే నష్టం జరుగుతుందని నియోజకవర్గంలో తొలుత నేనే చెప్పాను. మహిళలతో కలిసి వెళ్లి మద్యం షాపులు కూడా మూయించాను. ఇప్పటికైనా మద్యం మాని మీ ఆరోగ్యాలు కుదుటపరచుకోండి. ఎన్నికల తరువాత ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయించి నియోజక వర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తాను. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయించి, ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తాం. ఈ పర్యటనలో గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, మైనారిటీ నాయకులు సయ్యద్ ముజీబ్, తాడికొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బేతపూడి విజయ్ శేఖర్ తదితర టిడిపి బిజెపి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
May 6, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
AS Kalyana Mandapam Christian Meeting
May 6, 2024    

AS Kalyana Mandapam Christian Meeting

Tags: No Categories
Guntur Aryavaishya meeting
May 5, 2024    

Guntur Aryavaishya meeting

05-05-24 సాయంత్రం 9 గంటలకు గుంటూరు పట్టణం లో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి డాక్టర్ శ్రీ రత్న గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వచ్చిన తరువాత , ఆర్యవైశ్య లకు వర్తించే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు సోదరులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు…

Tags: No Categories
Swamiji Apartment Meeting
May 5, 2024    

Swamiji Apartment Meeting

Tags: No Categories
Vaderula Atmiya Samavesam
May 5, 2024    

Vaderula Atmiya Samavesam

అవినీతి పాలన. + జగన్ ప్రభుత్వం పై బీసీ సమావేశంలో పెమ్మసాని విమర్శలు. ‘యావన్మంది వైసీపీ నాయకులు అవినీతి పరులుగా మారారు. చిలకలూరిపేట నుంచి వచ్చిన రజిని అక్రమ వసూలలో రికార్డు సృష్టించగా, అఖిలార్ రోశయ్య అక్రమ మైనింగ్ తో వేలకోట్లు వెనకేసుకున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏ-వన్ కన్వెన్షన్ హాల్లో బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ… పెమ్మసాని చంద్రశేఖర్ గారు: ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి నుంచి పోటీ చేస్తున్న విడుదల రజనీ గారికి ఏ అర్హత లేకపోయినా వైద్య శాఖ మంత్రిగా ఎలా నియమించారు? దళితుల కు చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించడం వల్ల ఆమెకు మంత్రి పదవి వచ్చింది. అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ వైద్యం అందించే డాక్టర్లను కూడా కొందరు అవినీతిపరులు వేధిస్తున్నారు. అదేమని అడిగితే ఫీజులు పెంచమని, పెంచిన ఫీజులను ప్రజలపై మోపమని సలహా ఇస్తున్నారు. పథకాలు ఇస్తున్నారు కదా! అని ఈ వైసీపీ నాయకులకు ఓట్లు వేస్తే ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి ప్రజలను వేధిస్తుంటారు. మరోవైపు వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న కిలారు రోశయ్య ప్రజలకు సంబంధించిన 700 ఎకరాల్లో అక్రమ గ్రావెల్ తవ్వి, అవినీతి సంపాదనకు పాల్పడ్డారు. ఈ ఇద్దరు నాయకులు అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్నారు. కానీ నేను కష్టాలను చూస్తూ పెరిగాను. కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చి, మీ ఎదురుగా ఇలా నిలబడగలిగాను. * ఎక్కడెక్కడ పనులు దొరికితే అక్కడకు పిల్లలతో సహా వెళ్లి పనులు చేసుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తులు మీరు. చదవకపోయినా ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల వంటి గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తులు మీరు. గడచిన ఐదేళ్లుగా ఆదాయాలు పెరగకపోయినా నిత్యవసరకుల ధరలు, పెట్రోలు, ఇతర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసే కొంతమంది కార్మికులు సాయంత్రానికి కొంచెం మద్యం తీసుకుందామంటే అవి కాస్తా ప్రాణాంతకమైన రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. ఇవాళ, రేపు ఒక తోపుడు బండి పైనా డిజిటల్ పేమెంట్లు జరుగుతుంటే, ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్ లకు ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది. నివాసాలు లేనివారికి ఇల్లు కల్పించడం లేదా టిట్కో నివాసాలు అందించడం వంటి సహకారాలు అందిస్తాం. పిడుగురాళ్ల మాధవి: గడిచిన ఐదేళ్లలో ఈ జగన్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. క్వారలను అన్యాక్రాంతం చేస్తూ తమ పార్టీ నాయకులకు ఈ వైసిపి ప్రభుత్వం కట్టబెట్టింది. వడ్డెర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి, వందల కోట్లను కేటాయించిన టిడిపి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ను కేటాయించి నయా పైసా నిధులు ఇవ్వకుండా అవమానిస్తుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వడ్డెరలను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తున్నారు. ఒక అసమర్థుడైన, అవినీతిపరుడైన నాయకుడు చేతిలో ఇటుక రాయి ఉంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ప్రజల తలలు పగల కొడుతుంది. అదే సమర్ధుడైన నాయకుడు చేతిలో పెడితే ఒక నూతన నిర్మాణానికి నాంది పలుకుతుంది. అందరికీ మంచి చేయాలని వచ్చిన పెమ్మసాని గారి వంటి నాయకులు, చట్ట సభల్లో గళం విప్పాలనుకునే నా వంటి వారిని గెలిపిస్తే, అభివృద్ధికి బాటలు వేస్తాం. * ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, పశ్చిమ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి బాబు, టిడిపి జిల్లా పార్టీ కన్వీనర్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Guntur East Kapu Athmiya Samvesam
May 5, 2024    

Guntur East Kapu Athmiya Samvesam

మంగళగిరి పట్టణం లో జరిగిన నందివేలుగు కో ఆపరేటివ్ సోసైటీ బ్యాంకు లబ్ధిదారులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే ,ప్రజలు లకు వచ్చే సంక్షేమం గురించి మరియు సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు మరియు బ్యాంకు సిబ్బంది మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు…
Tags: No Categories
Fire Accident At Auto Nagar
May 5, 2024    

Fire Accident At Auto Nagar

ఇదీ వైసిపి బాగోతం. ఆటోనగర్ లోని టిడిపి ముస్లిం నాయకుల షాపులు దగ్ధం. షాపులు, 70 కార్లు బుగ్గిపాలు.ఎమ్మెల్యే అనుచరుల పనే అంటున్న బాధితులు నిన్న పర్యటనకు వచ్చారు. పర్యటనకు సహకరించని నాయకులను నోటికొచ్చినట్టు తిట్టారు. ఇవాళ షాపులు తగలబడ్డాయి. ఇది ఎవరి పనో ఇప్పటికైనా అర్థమైందా! బాధితులు అయితే వైసిపి నాయకుల పేర్లే చెబుతున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. ఆటోనగర్లో పలువురు టిడిపి ముస్లిం నాయకులకు చెందిన షాపులు ఆదివారం దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో 70 కార్లు, పలు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఈ సందర్భంగా వివరించారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించాలని కొందరు ప్రయత్నించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా జరిగిన పనే అని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న డాక్టర్ పెమ్మసాని, నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అర కిలోమీటర్ దూరంలో ఉన్న రెండు షాపులు అగ్ని ప్రమాదంలో ఎలా దగ్ధమవుతాయి? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అవి కూడా టిడిపి నాయకులకు చెందిన షాపులు మాత్రమే ప్రమాదానికి గురవుతాయా? అని నిలదీశారు. శనివారం నాడు ఆటోనగర్ కు వచ్చిన నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఎన్నికల పర్యటన నిర్వహించారని, అయితే స్థానిక ముస్లింలు ఎవరు వైసీపీ పర్యటనకు సహకరించలేదని తెలుస్తోందన్నారు. ఆ కక్షతోనే మరిసటి రోజున ఈ ప్రమాదం సృష్టించారని, బాధితులు ఆరోపిస్తున్నారని పెమ్మసాని తెలిపారు. జరిగిన ఘటనపై ఇప్పటికే తన వ్యక్తిగతంగా పోలీసులు ఉన్నతాధికారి అయిన ఐ.జి కి ఫిర్యాదు చేశానన్నారు. కారకులు ఎవరైనా సరే టిడిపి ప్రభుత్వం రాగానే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. మహమ్మద్ నసీర్: కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్న ఆటోనగర్ ను అగ్గి పాలు చేశారు. టిడిపికి మద్దతు ఇచ్చారన్న కక్షతోనే టిడిపి ముస్లిం నాయకులు షాపులపై కన్నెర్ర చేశారు. స్థానిక ముస్లిం నాయకుల మధ్యన వివాదాలు రేపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఈ ప్రమాదానికి కారణమని బాధితుల ద్వారా తెలుస్తుంది. ఎస్పీకి పెమ్మసాని ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడమే గాక సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తాం. మరోసారి ఇలా ఆస్తి నష్టాలు చేయాలని ప్రయత్నిస్తే ప్రయత్నించిన వారికి కూడా ఇలాంటి అగ్నితోనే సమాధానమే చెప్తాం జాగ్రత్త. ఈ పరిశీలన కార్యక్రమంలో టిడిపి నాయకులు నంబూరు సుభాని, మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టిడిపి నాయకులు షేక్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Yadavs Meeting
May 5, 2024    

Yadavs Meeting

యాదవులకు అండగా టిడిపి + బీసీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని గుంటూరులోని స్థానిక ఏ కన్వెన్షన్ హాల్లో బీసీ సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: యాదవ సోదరుల్లో ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత అన్న ఎన్టీఆర్, టిడిపికే దక్కుతుంది. ఈరోజుకు కూడా చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్లినా యాదవ సోదరుడైన యనమల రామకృష్ణుడిని తన పక్కనే ఉంచుకుంటారు. అది యాదవ సోదరులకు చంద్రబాబు గారి ఇచ్చే గౌరవం. కానీ జగన్ ను చూస్తే పక్కన పెట్టుకోవడం సంగతి దేవుడెరుగు, కనీసం యాదవులకు గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ పార్టీలో ఉన్న యాదవ సోదరుల కైనా కనీసం కుర్చీ వేసి గౌరవిస్తున్నారా! లేదా! ఆ నాయకులే చెప్పాలి. వైసీపీలోకి కొత్తగా వెళ్లిన నాయకులు ఎవరైనా సరే సజ్జల కుమారుడు భార్గవరెడ్డి ఎలా చెప్తే అలా వింటేనే పార్టీలో ఉండాలట! నేను రాజకీయాల్లోకి స్వార్థం కోసం రాలేదు, పదవుల కోసం రాలేదు. భగవంతుడిచ్చిన జ్ఞానంతో నా చుట్టూ ఉన్నవారికి మంచి చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. జీవితంలో పేదరికం నుంచి బయటపడలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న వారికి నాలాంటి వారి అవసరం ఉందని నమ్మి మీ ముందుకు వచ్చాను. పిడుగురాళ్ల మాధవి: ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాగా పనిచేసేందుకు సంసిద్ధమై వస్తున్నాం. మా సేవలు ఎప్పుడు గుర్తుండేలా పని చేయాలనేదే మా ధ్యేయం. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలానే బలమైన నిర్ణయంతో వస్తున్నాం. నాకు మీరు అందించే సహాయ సహకారాలను దృష్టిలో ఉంచుకొని మీ అందరి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్: యాదవులు ఏదైనా మాట ఇవ్వడానికి ఆలోచిస్తారేమో గాని, మాట ఇస్తే మాత్రం ప్రాణం పోయినా కట్టుబడి ఉంటారు. ఒకసారి సర్దుకుపోయి పని చేయడం మొదలుపెడితే విజయ తీరాలకు చేరేవరకు కృషి చేస్తాం. ఎన్డీఏ కూటమి విజయానికి మా సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అడక శ్రీనివాసరావు, యాదవ నాయకులు తట్టుకోల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Yadav's Meeting
May 5, 2024    

Yadav's Meeting

యాదవులకు అండగా టిడిపి + బీసీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని గుంటూరులోని స్థానిక ఏ కన్వెన్షన్ హాల్లో బీసీ సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: యాదవ సోదరుల్లో ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత అన్న ఎన్టీఆర్, టిడిపికే దక్కుతుంది. ఈరోజుకు కూడా చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్లినా యాదవ సోదరుడైన యనమల రామకృష్ణుడిని తన పక్కనే ఉంచుకుంటారు. అది యాదవ సోదరులకు చంద్రబాబు గారి ఇచ్చే గౌరవం. కానీ జగన్ ను చూస్తే పక్కన పెట్టుకోవడం సంగతి దేవుడెరుగు, కనీసం యాదవులకు గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ పార్టీలో ఉన్న యాదవ సోదరుల కైనా కనీసం కుర్చీ వేసి గౌరవిస్తున్నారా! లేదా! ఆ నాయకులే చెప్పాలి. వైసీపీలోకి కొత్తగా వెళ్లిన నాయకులు ఎవరైనా సరే సజ్జల కుమారుడు భార్గవరెడ్డి ఎలా చెప్తే అలా వింటేనే పార్టీలో ఉండాలట! నేను రాజకీయాల్లోకి స్వార్థం కోసం రాలేదు, పదవుల కోసం రాలేదు. భగవంతుడిచ్చిన జ్ఞానంతో నా చుట్టూ ఉన్నవారికి మంచి చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. జీవితంలో పేదరికం నుంచి బయటపడలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న వారికి నాలాంటి వారి అవసరం ఉందని నమ్మి మీ ముందుకు వచ్చాను. పిడుగురాళ్ల మాధవి: ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాగా పనిచేసేందుకు సంసిద్ధమై వస్తున్నాం. మా సేవలు ఎప్పుడు గుర్తుండేలా పని చేయాలనేదే మా ధ్యేయం. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలానే బలమైన నిర్ణయంతో వస్తున్నాం. నాకు మీరు అందించే సహాయ సహకారాలను దృష్టిలో ఉంచుకొని మీ అందరి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్: యాదవులు ఏదైనా మాట ఇవ్వడానికి ఆలోచిస్తారేమో గాని, మాట ఇస్తే మాత్రం ప్రాణం పోయినా కట్టుబడి ఉంటారు. ఒకసారి సర్దుకుపోయి పని చేయడం మొదలుపెడితే విజయ తీరాలకు చేరేవరకు కృషి చేస్తాం. ఎన్డీఏ కూటమి విజయానికి మా సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అడక శ్రీనివాసరావు, యాదవ నాయకులు తట్టుకోల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
1 2 3 4 5 6 7 8 9 10 11 12