సకల శుభాలకు మూలం. * మహా లక్ష్మమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని దంపతులు. ‘మహాలక్ష్మి అంటేనే సకల శుభాలకు మూలం. ఆ తల్లి దయతో రాష్ట్రానికి పట్టిన చీడ త్వరలో వీడిపోవాలి. అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలోని స్థానిక 55వ డివిజన్లో గల బుచ్చయ్య తోటలో ఉన్న శ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పెమ్మసాని దంపతులు సోమవారం పాల్గొన్నారు. పెమ్మసాని దంపతులు తొలుత దేవాస్థానంలోకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా పెమ్మసాని దంపతులతో పాటు గుంటూరు నసీర్ అహ్మద్ ను సత్కరించారు. అనంతరం భోజన ప్రసాద వితరణ లో పాల్గొన్న పెమసాని దంపతులు నాసిర్ భక్తులకు భోజనం వడ్డించారు. జంధ్యాల వేంకట రామలింగేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, ఆలయ సేవా సమితి సభ్యులతో పాటు పలువురు టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Tags: No Categories