నృసింహుని ఆశీర్వాదం ఏపీకి అవసరం. * మంగళగిరి రథోత్సవంలో నారా లోకేశ్ – ‘డా. పెమ్మసాని. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఆంధ్రప్రదేశ్ కు అవసరం. ఆ స్వామి కృపాకటాక్షాలతో త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది.’ అని టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేశ్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా . పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు . మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న రథోత్సవంలో యువనేత లోకేష్ తో కలిసి డా.. పెమ్మసాని సోమవారం పాల్గొన్నారు. ఆ సందర్భంగా , భక్తులతో కలిసి లోకేశ్ రథాన్ని లాగారు. పెమ్మసాని తొలుత పానకాల స్వామి దర్శనం చేసుకోగా, అనంతరం దిగువనపర్వతానికి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లి దర్శనంతో పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ప్రాంగణానికి వెలుపల ఉ న్న స్వామి వారి ఉత్సవ విగ్రహం ఉన్న రథాన్ని నారా లోకేశ్తో కలిసి ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జయహో నరసింహా అంటూ భక్తులు భక్తి పారవశ్యం కొద్దీ తరించిపోయారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ, జిల్లా, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.
Tags: No Categories