చేబ్రోలు మండలంలోని శుద్ధపల్లి నల్లపాడు వీరనాయకుని పాలెం సేకూరు, గరువుపాలెం వడ్లమూడి ప్రాంతాలలో పొన్నూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర తో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. అనంతరం వడ్లమూడి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమ ముగింపు సభలో డాక్టర్ పెమ్మసాని ఈ విధంగా మాట్లాడారు.. ముస్లింల ఆవేదన చూసి తట్టుకోలేకపోయాను. డా. పెమ్మసాని రెండు రోజుల క్రితం లామ్ గ్రామంలో టీడీపీలో చేరిన కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతూ ‘మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్న’ అని చెప్పారు. ఆ క్షణం నేను ఆవేదన చెందాను అని వివరించారు. ఒక్క రూపాయీ అవినీతి జరగదు. ఎవరి కష్టం వృథా కాకుండా, ఒక్క రూపాయి అవినీతి జరక్కుండా అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది. ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 25 కోట్ల ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులను కూడా కలిపి అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. తాను పనిచేస్తానే తప్ప, ఒకరి కష్టాన్ని దోచుకోవడం చేతకాదని తెలిపారు.