జగన్ ప్రచార పిచ్చికి చెల్లు చీటీ. + పార్లమెంటుకు వెళ్ళింది మొదలు గుంటూరు పేరే వినిపిస్తుంది. + పెదనందిపాడు మండలం పర్యటనలో పెమ్మసాని. ‘ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల పొలాల్లో పునాదిరాళ్లపైన జగన్ ఫోటోలను అతికించుకున్నారు. ఎవరి ఆస్తుల్లో ఎవరి ఫోటోలు అతికించుకుంటారు? ఇదేనా ప్రజా సంక్షేమం?’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి చంద్రశేఖర్ గారు ప్రశ్నించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం లోని పెదనందిపాడు మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని గారు శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నాగభైరవ పాలెం, జరుగు వారి పాలెం, ఉప్పలపాడు, పరిటాల వారి పాలెం, అన్నవరం, రాజుపాలెం, పాలపర్రు, అభినయని గుంట పాలెం, గిరిజవోలు గుంట పాలెం, గోగులమూడి, కాట్రపాడు, కుసులూరు గ్రామాల్లో ఆ ఇరువురు నాయకులు పర్యటించారు. కాగా ఈ సందర్భంగా పలు గ్రామాలు ప్రజలు మాట్లాడుతూ గ్రామాల్లోని పలు అంతర్గత, గ్రామాల్లోకి రాకపోకలు సాగించే రహదారులు ఇబ్బందికరంగా మారాయని, నీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రజల వినతులు సావధానంగా విన్న తర్వాత పెమ్మసాని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల సహకారంతో వచ్చిన జలజీవన్ మిషన్ నిధులను ఈ జగన్ కేవలం కడపకి మాత్రమే తరలించుకున్నారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి రాగానే నివాసాలకు కులాయి కనెక్షన్లు వచ్చేలా కృషి చేస్తామని, నకిలీ విత్తనాలు ఎరువులు మార్కెట్లోకి రాకుండా అరికడతామని తెలిపారు. అలాగే రైతుల ప్రోత్సాహకాల నిమిత్తం పసుపు, మిర్చి, టొమాటో ఇతర పంటల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. సిఎస్ఆర్ రాజ్యసభ నిధులతో అభివృద్ధికి పునాది వేస్తానని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సులభతరమయ్యేలా స్కిల్ డెవలప్మెంట్ కు, అవసరమైతే సొంత ఖర్చులతో అందిస్తానని ఈ సందర్భంగా పెమ్మసాని స్పష్టం చేశారు. అలాగే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ప్రతి గ్రామాన ఉన్న సమస్యలను గుర్తించామని చెప్పారు. తాము ఎక్కడ ఎక్కడైతే పర్యటనలు చేస్తున్నామో, ఆయా గ్రామాలన్నింటిలోనూ వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. అయినా కొందరు కార్యకర్తలు వైసిపి కోసం తిరుగుతున్నారని, మునిగిపోయే పడవలో తిరగటం అనవసరమని ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి రామాంజనేయులు మాట్లాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ మాట్లాడుతూ వైసీపీ అరాచకాలతో విసుగు చెంది, వ్యతిరేకంగా ఉన్న మాలాంటి ఎందరో నాయకులు ప్రజాక్షేమం గురించి ఆలోచించే టిడిపి వైపు చూస్తున్నారన్నారు. అభివృద్ధి జరగాలంటే టిడిపి తరఫున పోటీ చేస్తున్న ఎంపీగా పెమ్మసానిని, ఎమ్మెల్యేగా బూర్ల రామాంజనేయులు మెజారిటీతో గెలిపించాలని జగన్ విధ్వంసక పాలనకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విన్నవించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ముస్లిం నాయకులు సయ్యద్ ముజీబ్, ఉగ్గిరాల సీతారామయ్య తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories