పెమ్మసాని నేతృత్వంలో టీడీపీలో చేరిన తాడిసెట్టి. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేష్ .
గుంటూరు నుంచి 2 వేల మందితో భారీ ర్యాలీ, ఉండవల్లిలో చేరికలు\nటిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపునకు స్పందిస్తూ డా. పెమ్మసాని తన రాజకీయ చతురతను ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలను చేరుస్తున్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరేట్టుగా చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసిపికి చెందిన ప్రముఖ బిసి నాయకుడు, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీ మోహన్, తన అనుచరులు 2 వేల మంది గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో టిడిపిలో శుక్రవారం చేరారు. గుంటూరు నుంచి ఉండవల్లి వరకు నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబునాయుడు బీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఉపకులాల వారీగా సాయం అందజేశారు. ఆదరణ పథకం కింద రూ.962 కోట్లతో నాణ్యమైన పనిముట్లు అందజేశాం. జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీలకు ప్రత్యేక హామీలు ఇచ్చాం. 50ఏళ్లు నిండిన బీసీ సోదరులకు పెన్షన్, పెళ్లికానుక ద్వారా రూ.లక్ష సాయం, ఉపకులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటుచేసి నిధులు కేటాయిస్తాం. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడైన మురళి టుబాకో బోర్డు వైస్ చైర్మన్ గా, టిటిడి సలహా మండలి సభ్యుడిగా, గుంటూరు జిల్లా ధార్మిక మండలి చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ… టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలిపించేందుకు అందరం కష్టపడి పనిచేస్తాం. వైసీపీకి, జగన్ కి బుద్ధి చెప్పాలంటే వారిని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలి. అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు సైనికుడిలా కూటమి విజయానికి కృషిచేస్తామని మురళి అన్నారు.\nఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ టిడిపి ఇన్చార్జి కోవెలమూడి నాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గళ్లా మాధవి, గుంటూరు తూర్పు టిడిపి అభ్యర్థి నసీర్ అహమ్మద్, ప్రత్తిపాడు టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పార్లమెంటు తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జోన్-3 మీడియా కో ఆర్డినేటర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
పెమ్మసాని నేతృత్వంలో టీడీపీలో చేరిన తాడిసెట్టి. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేష్
గుంటూరు నుంచి 2 వేల మందితో భారీ ర్యాలీ, ఉండవల్లిలో చేరికలు
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపునకు స్పందిస్తూ డా. పెమ్మసాని తన రాజకీయ చతురతను ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలను చేరుస్తున్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరేట్టుగా చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసిపికి చెందిన ప్రముఖ బిసి నాయకుడు, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీ మోహన్, తన అనుచరులు 2 వేల మంది గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో టిడిపిలో శుక్రవారం చేరారు. గుంటూరు నుంచి ఉండవల్లి వరకు నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబునాయుడు బీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఉపకులాల వారీగా సాయం అందజేశారు. ఆదరణ పథకం కింద రూ.962 కోట్లతో నాణ్యమైన పనిముట్లు అందజేశాం. జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీలకు ప్రత్యేక హామీలు ఇచ్చాం. 50ఏళ్లు నిండిన బీసీ సోదరులకు పెన్షన్, పెళ్లికానుక ద్వారా రూ.లక్ష సాయం, ఉపకులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటుచేసి నిధులు కేటాయిస్తాం. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడైన మురళి టుబాకో బోర్డు వైస్ చైర్మన్ గా, టిటిడి సలహా మండలి సభ్యుడిగా, గుంటూరు జిల్లా ధార్మిక మండలి చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ… టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలిపించేందుకు అందరం కష్టపడి పనిచేస్తాం. వైసీపీకి, జగన్ కి బుద్ధి చెప్పాలంటే వారిని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలి. అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు సైనికుడిలా కూటమి విజయానికి కృషిచేస్తామని మురళి అన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ టిడిపి ఇన్చార్జి కోవెలమూడి నాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గళ్లా మాధవి, గుంటూరు తూర్పు టిడిపి అభ్యర్థి నసీర్ అహమ్మద్, ప్రత్తిపాడు టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పార్లమెంటు తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జోన్-3 మీడియా కో ఆర్డినేటర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories