“గంజాయి ప్రభుత్వం – చర్చకు నే సిద్ధం.+ పదేళ్ల ఎమ్మెల్యే ఒక్క వీధిలో అయినా తిరిగారా?తూర్పు నియోజకవర్గ పర్యటనలో డాక్టర్ పెమ్మసాని’151 సీట్లు ఇచ్చి పాలన చేయమంటే, గంజాయి సరఫరా చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్ ప్రభుత్వపు అవినీతిపై చర్చకు నేను సిద్ధం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 50, 51, 52, 53, 54, 55, 56 డివిజన్లలో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి పెమ్మసాని గారు పర్యటించారు. ప్రచారంలో పలు నివాసాలు వస్త్ర వాణిజ్య వ్యాపార సంస్థలను ప్రజలను ఆయన కలుసుకుంటూ ప్రచారం కొనసాగించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ, పలు వివరాలను సేకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…
పెమ్మసాని చంద్రశేఖర్ గారు: ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే టిడిపి స్వీప్ చేస్తుందని స్పష్టమవుతుంది. రాజధానిని బాగు చేయమని కోరితే జగన్ గంజాయిని పెంచి పోషించారు. 2019కి ముందు జగన్ బ్రాండ్ల నాసిరకం మద్యం ఎక్కడైనా కనిపించిందా? రాజధాని ఎక్స్ప్రెస్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ గోల్డ్, పవర్ స్టార్ అంటూ ఎప్పుడూ వినని పేర్లతో మద్యం బ్రాండ్లు ప్రజలపైకి వదిలారు. ఎమ్మెల్యే బంధువులు బందిపోట్లు మాదిరిగా నియోజకవర్గాన్ని దోచుకున్నారు. జగన్ ప్రభుత్వపు అవినీతిపై నేను చర్చకు సిద్ధం, రావడానికి మీరు సిద్ధమా? పదేళ్లుగా ఎప్పుడైనా ఈ వీధుల్లో, సందుల్లో ఎమ్మెల్యే తిరిగారా? కృష్ణానది పక్కనే ఉన్నా, నీటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నా గుంటూరుకు ఎందుకు నీరు అందించలేకపోతున్నారు? ఈ అసమర్ధ పాలనలో రాజధాని లేదు, ఒక పరిశ్రమ లేదు, ఇక విద్యార్థులకు ఉపాధి ఎక్కడ నుంచి వస్తుంది? మళ్లీ లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాలంటీర్ల పేరుతో రూ. 3-5 వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల కడుపు నిండుతుందా? ఉపాధి అంటే నెలకు రూ. 30-40 వేలు దాకా సంపాదించుకోగలిగే అవకాశాలు కల్పించాలి. నా శక్తి మేరకు ప్రజలకు మేలు చేస్తానే తప్ప ఎవరి కష్టాన్ని దోచుకోవాల్సిన పని లేదు. నసీర్ అహ్మద్: ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకపోగా, పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మార్చిన నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా అరాచక పాలన చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. సంక్షేమం పేరిట పేదల జేబులకు చిల్లు పెట్టారు. ఈ పర్యటనలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నేరెళ్ల సురేష్ కుమార్, నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర వర్మ, 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, ముస్లిం నాయకుడు సయ్యద్ ముజీబ్ తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.”
Tags: No Categories