జగన్ దృష్టిలో అభివృద్ధికి తావు లేదు.తెనాలి అపార్ట్మెంట్ వాసులతో పెమ్మసాని.తెనాలిలోని చెంచుపేటలో నివసించి అపార్ట్మెంట్ వాసులతో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అసెంబ్లీ నియోజకవర్గ కోటమీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: జగన్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో విచిత్ర స్థితి ఏర్పడింది. జగన్ దృష్టిలో రోడ్లకు, వంతెనలకు, తాగు నీళ్లకు ఓట్లు రావని నిర్ణయించుకున్నారు. ప్రజల మౌలిక సదుపాయాలు అంటే తమకు సంబంధం లేదన్నట్టు ఈ వైసీపీ ప్రభుత్వం పని చేస్తుంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితిలో నేను అందరిలాగే అవి చేస్తాను, నిర్మిస్తానని హామీలు ఇవ్వకూడదు. కానీ ప్రస్తుత టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఆర్థిక పరిస్థితులు ఊపొందుకుంటున్నాయి. నేను, మనోహర్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎన్నికలు వస్తుండగా ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ ను ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో జగన్ కే తెలియాలి. సమస్యలు వారే సృష్టించి, పరిష్కారం అనే పేరుతో ప్రజల స్థలాలు, పొలాలపై పంచాయతీలు జరపడానికి ఈ యాక్ట్ ను ఉపయోగించబోతున్నారు. ఆ చట్టం కనుక అమల్లోకి వస్తే సజ్జల, ఆల్ల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి లాంటివాళ్ళు న్యాయమూర్తులుగా తయారవుతారేమో! అందుకే ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ యాక్టును వ్యతిరేకించాలి. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో తాను పక్కాలోకల్ అంటూ కిలాడి రోశయ్య ప్రకటించుకుంటున్నారు. మరోవైపు అమరావతి రాజధానిగా వద్దు అని, మూడు రాజధానులు కావాలని స్పష్టం చేస్తున్నారు. పక్కా లోకల్ అంటే స్థానికుల ప్రయోజనాలను కాపాడటం, వారి జీవితాలను మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలి, అభివృద్ధి జరపాలి. కానీ కిలారు నిర్ణయాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కిలారు రోశయ్య చేసిన అవినీతి వల్ల జగన్ ఏది చెప్తే అది చేయాల్సిన దుస్థితికి దిగజారారు. అదే నేను రోశయ్య స్థానంలో ఉండి ఉంటే నా రాజీనామా లేఖను ఆ పార్టీ నాయకుల మొహాన విసిరేసి వచ్చేవాడిని. అది అసలైన నాయకుడి పనితనం అంటే. చెడు ఉన్నప్పుడే మంచి విలువ తెలుస్తుందని తెలియజేయడానికి అన్నట్టు మాలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడానికి తప్ప ఈ జగన్, ఆయన ప్రభుత్వం ఎందుకు పనికిరాదు. నేను, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఉన్నంతవరకు ఈ అమరావతిని అడుగు కూడా కదిలించలేరు. నేను పల్నాడు ప్రాంతంలో పుట్టిన వాడిని. ఈ బెదిరింపులు, బాంబులు చూస్తూనే పెరిగాను. నేను కేవలం అభివృద్ధి చేయాలన్న కాంక్షతో మాత్రమే నా సొంత గడ్డపై అడుగుపెట్టాను. గుంటూరు జిల్లా దాటి ఇతర దేశాలలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేయించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నాను. రాబోయే 30 ఏళ్లలో నావల్ల నా ప్రాంతానికి మంచే జరుగుతుందని హామీ ఇస్తున్నాను. నాదెండ్ల మనోహర్: తెనాలికి సంపూర్ణంగా రక్షిత మంచినీటి పథకం అందించాలని నేను ఎమ్మెల్యే గా ఉండగా విజయవాడ నుంచి పైప్ లైన్ లు వేసాం. రోజుకు 30 లక్షల లీటర్లు నీరు అందేలా అప్పట్లోనే ప్రణాళికలు రచించాం. కానీ నేడు రోజుకు 12 లక్షలు లీటర్లు కూడా అందడం లేదు. ఆ పైప్ లైన్ల ద్వారా సరైన సరఫరా అందడం లేదని తెనాలి ప్రజానీకం ఫిర్యాదులు చేస్తూనే ఉంది. అపార్ట్మెంట్ వాసులు నేడు ఒక విచిత్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. నేడు తెనాలి నుంచి విజయవాడ, గుంటూరుకు వెళ్లాలంటే ప్రయాణికుల, నడుములు విరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. రోడ్లు అభివృద్ధి అనే మాటలు విని 5 ఏళ్లు గడిచిపోయాయి. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మాత్రమే టిడిపి, జనసేన, బిజెపి ఒప్పందం కుదుర్చుకున్నాయి తప్ప, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా కొండలు తవ్వడానికో, పదవుల కోసమో కాదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. విద్యావంతులైన మన బిడ్డలు ఇకనుంచి ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లాల్సిన పనిలేదు. మన తెనాలిలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఇక్కడే నివసించే విధంగా చర్యలు తీసుకుందాం.

Tags: No Categories