అణచివేత, డబ్బే జగన్ రాజకీయం + ఉద్యోగస్తులను జగన్ బిచ్చగాళ్లుగా చేశారు. + ఇకనైనా ప్రజలు చైతన్యవంతం కావాలి + ప్రత్తిపాడు మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. ప్రత్తిపాడు: ‘అధికారంలోకి వచ్చింది మొదలు అణచివేత, డబ్బు ఈ రెండిటి ఆధారంగానే జగన్ తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వకుండా బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. ఒకటో తేదీన జీతాలు వస్తే చాలు అన్నట్లు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు తో కలిసి పెమ్మసాని ప్రత్తిపాడు మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా యనమదల, ఈదుల పాలెం, చినకొండ్రుపాడు, రావిపాటి వారి పాలెం, ప్రత్తిపాడు, పెదగొట్టిపాడు గ్రామాల్లో ఇరువురు నాయకులు తమ పర్యటనను కొనసాగించారు. పర్యటనలో భాగంగా పలు గ్రామాలలో పెమ్మసాని, రామాంజనేయులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తల్లిదండ్రులు నేర్పించే మంచితనమే పిల్లలు కూడా అలవర్చుకుంటారు. శత్రువైనా సరే ఎదురొచ్చినప్పుడు నవ్వుతూ నమస్కారం చేయడం భారతీయ సంప్రదాయం. ఓట్లు ఎవరికి వేయాలన్నది ఓటర్ల వ్యక్తిగతమైన విషయం. అలా అని కక్ష్య, ఈర్ష్యలతో మెసలడం అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దయచేసి నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. * ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్లుగా ఇక్కట్లు పాలయ్యారు. ఇటీవల నన్ను కలిసిన కొందరు ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు వచ్చేట్టుగా చూడమని చేసిన అభ్యర్థనను వింటే వాళ్ళ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పోలీసులను ఒక రాక్షసులుగా, ఇంకొందరు ఉద్యోగులను బానిసలుగా మార్చిన ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే. ప్రకృతి సహజ సిద్ధవనరులైన ప్రాంతాల్లో బాక్సైట్, గ్రానైట్, మైనింగ్ అంటూ అక్రమ తవ్వకాలతో వైసీపీ నాయకులు దోచేస్తున్నారు. ఆ అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేస్తూ, రాజకీయం చేస్తున్నారు. ఇకనైనా ప్రజలు చైతన్యవంతులు కావాలి. లేకపోతే సమాజం నాశనం అవుతుందని అర్థం చేసుకోవాలి. మరో రెండు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో టిడిపి 120-130 స్థానాల్లో విజయం సాధించబోతుంది. రోడ్లు అద్వానంగా ఉన్న పలు గ్రామాల్లో రహదారులు నిర్మింపచేసే బాధ్యత మేము తీసుకుంటాం.’ అని మాట్లాడారు. + బూర్ల రామాంజనేయులు: ఈ అరాచక పాలనకు మరొక రెండు రోజులే గడువు ఉంది. టిడిపి ప్రభుత్వంలో వేసిన రోడ్లే తప్ప వైసీపీ ఏ ఒక్క రోడ్డు అయినా వేసిందా? మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవచ్చు. 50 ఏళ్లకే పెన్షన్ రావాలంటే చంద్రబాబు రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు రావాలి. * ఈ పర్యటనలో టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బీసీ టీడీపీ నాయకులు నిమ్మల శేషయ్య తదితర గ్రామ మండల స్థాయి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories