పెమ్మసానికి జన నీరాజనం. + పెదకాకాని మండలంలో పెమ్మసాని, ధూళిపాళ్ల పర్యటనకు విశేష ఆదరణ. + గజమాలతో సత్కారాలు, అడుగడుగునా పూల వర్షం + ఇళ్ల నుంచి బయటికి వచ్చి మరీ ప్రజల అభివాదాలు. + పెమ్మసాని పర్యటనకు ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు. జన ప్రభంజనం. పెదకాకాని మండలం పసుపుమయమైంది. పెమ్మసాని ఆగమనానికి ఉర్రూతలూగింది. రహదారులు కానరాని విధంగా పూల వర్షం కురిపించింది. భవన పై అంతస్థులపై నిలబడి మరీ స్వాగతాంజలి పలికింది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, వెనిగండ్ల, పెదకాకాని ప్రాంతాల్లో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ గారు మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలి తక్కువ నుంచి ప్రారంభించిన రోడ్ షో పెదకాకాని ముగింపు సభ వరకు దిగ్విజయంగా కొనసాగింది. గ్రామ గ్రామాన ప్రజలు ప్రభంజనంలా కదిలి వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. భవనాల పైనుంచి నిలబడ్డ యువత మహిళలు చిన్నారులు పూల వర్షం కురిపిస్తున్న కురిపిస్తుండగా పెమ్మసాని గారు అభివాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. పెమ్మసాని ప్రచారం ఇలా అంగరంగ వైభవంగా కొనసాగుతుండగా ప్రధాన కూడలికి వచ్చేసరికి ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అధికారులను ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచి నిలిచిపోయింది. కాగా అభిమానుల అండ ఉన్న పెమ్మసాని సెల్ఫోన్ లైట్ల వెలుగుల మధ్యనే ఆయన తన ప్రచారాన్ని ముందు కొనసాగించారు. అభిమానులు, కార్యకర్తలు చైతన్య రథానికి చుట్టూ రక్షణ కవచంలా నిలబడి ప్రచార కార్యక్రమం ముందుకు సాగడానికి సహకరించారు. విప్లవ కాంతి నుంచి ప్రజాయాత్ర చేస్తూ వస్తాను – పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ‘విద్యుత్ కట్ చేసినంత మాత్రాన మా ప్రయాణం ఆగదు బ్రదర్! ప్రజా విప్లవ కాంతిలో నుంచి ప్రజాయాత్ర చేసుకుంటూ వస్తాను. నేను మీలాగా మద్యం అమ్మానా? మోసం చేశానా? మైనింగ్ తవ్వేనా? ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి వచ్చాను. నేను సంపాదించిన కరెన్సీకి ఉన్న నిజాయితీ, నీ అవినీతి సొమ్ముకు ఉండదు బ్రదర్! మైనింగ్ లు తవ్వి, అక్రమాలు చేసిన అవినీతి సొమ్ముతో పవన్ కళ్యాణ్ ను ఈ సోకాల్డ్ నాయకులు ఓడిస్తారట! రాసి పెట్టుకోండి ఇప్పుడే చెప్తున్నాను, తలరాత రాసిన బ్రహ్మ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపలేరు. ఈ ప్రభుత్వం ”మద్యం సేవే మాధవసేవ, కోటి విద్యలు క్వార్టర్ కొరకే” అన్న తీరున పనిచేస్తుంది. ఓవైపు చూస్తే నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంకోవైపు చూస్తే ఆదాయం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితమైన మార్పు తీసుకువస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పేదలకు, నివాసం లేని ప్రజలకు టిట్కో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది. రూరల్ ప్రాంతాల్లో రెండు, మూడు సెంట్లలో నివాసాలు నిర్మింపజేసి ఇచ్చేలా కృషి చేస్తాం. నియోజవర్గంలో ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి వ్యక్తి కష్టం ధూళిపాళ్ల నరేంద్ర గారికి తెలుసు. అలాంటి వ్యక్తిని ఈ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయాలని చూసింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిగా నాకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ధూళిపాళ్ల గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.’ అని పెమ్మసాని గారు ఈ ప్రభుత్వం పనితీరుపై విరుచుకుపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర గారు. ‘ఈ నియోజకవర్గంలో ఒక్కో వ్యక్తికి ఈ వైసీపీ నాయకులు రూ. లక్ష దాకా అప్పు పడ్డారు. మన సొమ్మును దోచుకు వెళ్లి రేపు ఎన్నికల్లో తిరిగి రూ. 5 వేలు, రూ. 10 వేలు అంటూ ఓట్లు కొనడానికి వస్తారు. దేవాలయాలు, మందిరాలకు వెళ్లి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే మనలాంటి భక్తులకు బదులు హుండీలో చేయి పెట్టే దొంగ, దోపిడి నాయకులు మన ప్రాంతంలో ఉన్నారు. 31 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని మా కుటుంబం నమ్ముకుని ఉంది. రాజధాని నిర్మాణానికి అడ్డుపడ్డ కరకట్ట కమలహాసన్ ప్రజలను మోసం చేశారు. అవినీతి సొమ్ముతో నన్ను నాశనం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీ దగ్గర అవినీతి సొమ్ము ఉందేమో! నా దగ్గర ప్రజాభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారం ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతిని ఎందుకు అడ్డుకోలేకపోయింది? అది అసమర్థతా? చేతకానితనమా? జగన్మోహన్ రెడ్డి దగ్గర టికెట్ తెచ్చుకోవడం చేతకాని నాయకులు పెదకాకానికి వచ్చి తామున్నామని చెప్పి మాట్లాడటం, ప్రజలను ఇంకా మోసపుచ్చటం సిగ్గుచేటు. అలాంటి నాయకుల మాట వింటే మళ్లీ మోసపోవడానికి సిద్ధపడ్డట్టే. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలిగే సత్తా లేని నాయకులు, శివాలయం రోడ్డుని శివాలయం నిధులతోనూ, దర్గా దగ్గరి రోడ్డును దర్గా నిధులతోనూ నిర్మించే స్థితికి చేరారు.’ అని ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడారు. పెమ్మసాని గెలుపు – మాదిగ గెలుపు. పెదకాకాని మండలంలో పర్యటిస్తున్న గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆయన వెన్నంటి ఉంటూ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఎమ్మార్పీఎస్ గుంటూరు జిల్లా ఇంచార్జ్ కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ ఏపీలో అనేక పార్టీలు పాలన సాగించినప్పటికీ మాదిగల వర్గీకరణకు కృషి చేసింది టిడిపినే అన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో టిడిపికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు పెమ్మసాని గెలుపులో మాదిగల పాత్ర కచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు మురికిపూడి హృదయ రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకురాలు నంబూరి తబిత మాదిగ, ఎమ్మార్పీఎస్ పొన్నూరు నియోజకవర్గ నాయకులు డేగల బాబు మాదిగ, జాతీయ నాయకురాలు ఆలపాటి కరుణా మాదిగ తదితరులు పాల్గొన్నారు.