సామాన్యుడికి ఉపాధి ఎక్కడ? పోలవరం నిర్వీర్యం జగన్ పుణ్యమే. + కాకుమాను మండల పర్యటనలో పెమ్మసాని. పర్యటన వివరాలు.కాకుమాను మండల పర్యటనలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. రేటూరు, అప్పాపురం, పెదనందిపాడు, కాకుమాను గ్రామాల్లో పర్యటించిన పెమ్మసానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రచార రథం వెంటనే నడుస్తూ జేజేలు పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
సంక్షేమ పథకాలు జగన్ కొత్తగా ఇవ్వడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుమించిన పథకాలు అందజేశారు. మంచినీరు, రోడ్లు ఇస్తే ఓట్లు రావని, ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తికి ఉద్యోగం అందిస్తే, నెలకి రూ. 30,000 సంపాదించుకోగలిగిన అవకాశం కల్పిస్తే సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఫిల్టర్ బెడ్స్ శుభ్రం చేయాలి, చెరువులకు నీరు అందించాలి, నిర్వహణ చేపట్టాలి, ఇవన్నీ సరైన క్రమంలో జరిగితేనే ప్రజలకు సరైన సమయంలో తాగు, సాగునీరు అందుతుంది. ప్రజలకు ఆపద వచ్చిందని తెలిస్తే చంద్రబాబు వెంటనే వచ్చి పరిష్కారం చూపిస్తారు. అదే ప్రజలు సమస్యలతో తల్లడిపోతున్నా సరే జగన్ కనీసం కన్నెత్తి చూడరు. ఇదే ఆ ఇద్దరు నాయకులకు ఉన్న తేడా. కల్తీ మద్యాన్ని గంజాయిని ఎవరు అరికట్టగలరు ప్రజలే నిర్ణయించుకోవాలి. రాష్ట్రం నిండా అప్పుల మయమైపోయింది. ఇల్ల స్థలాలపై క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ఆదాయం కూలిపోయింది. కొన్ని రోజులు గడిస్తే జగన్ కు కనీసం అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు.
పోలవరం పై చేతులు ఎత్తేసిన జగన్.
రివర్ టెండరింగ్ పేరుతో పోలవరంలో పనులు ఆగిపోయేదాకా జగన్ కు నిద్ర పట్టలేదు. చంద్రబాబు గారు సోమవారం పోలవరంగా సమయానికి కేటాయించుకుని మరీ 72% పనులు పూర్తి చేయించారు. ఇలా నాలుగింట మూడు వంతుల వంతు ప్రాజెక్టు పూర్తయిన పోలవరం పై కాంట్రాక్టర్లు మార్చడం, బిల్లులు ఆపేయడం వంటి పనుల వల్ల పోలవరం అర్ధాంతరంగా నిలిచిపోయింది. మరో నెలలో మా ప్రభుత్వం వస్తుంది. మేము కూడా ఇలా చేయలేమా! రాజకీయం చేయడం మాకు చేతకాదా బ్రదర్! ఆ చిన్నపాటి కానీ మేము మా టిడిపి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నాం. సమాజంలో ప్రజలను సమతుల్యంగా ముందుకు నడిపించడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. ఆయన నాయకత్వంలో ఢిల్లీలోని ప్రతి గల్లీ తిరిగైనా సరే నిధులు సమీకరించి అభివృద్ధి చేయగల సమర్థత సామర్థ్యం నాకు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు సమీకరించి డ్రైనేజీ రోడ్లు మంచినీటి పథకాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు అందేలా చూస్తాం. కాకుమాను గ్రామంలో స్థానికుల కోరిక మేరకు అడిగిన ఆర్వో ప్లాంట్ పై అంశంపై మాట్లాడుతూ ఎన్నికల వెంటనే ఆరో ప్లాంట్ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ప్రజలందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
స్మశానానికి కూడా రోడ్డు వేయలేని ప్రభుత్వం – బూర్ల రామాంజనేయులు. దళితుల ఏరియాలో స్మశానానికి రహదారి కోరడం కనీస అవసరం కూడా తీర్చలేని ఈ ప్రభుత్వం శుద్ధ దండగ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్మశానానికి వెళ్లే రోడ్డు నిర్మాణం చేపడతాం.వైసిపి ఎమ్మెల్యే కనిపించడం లేదు – జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో బుగ్గల తిరిగిన జగన్ ను నమ్మి ఇక్కడ ఒక ఎమ్మెల్యే అను గెలిపించారు. ప్రజల పుణ్యమా అని ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని నిర్ణయించుకున్న ఆ మహిళా ఎమ్మెల్యే ఆరు నెలలుగా ప్రజల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆరు నెలలుగా కనిపించడం లేదు. మాటలు మొహం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేక రూ. 200 రూపాయలతో ప్రజలు నీళ్ళు కొనుక్కుంటుంటే ఈ ఎమ్మెల్యే ఎటు వెళ్లిపోయారు? కూటమి తరఫున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, బూర్ల రామాంజనేయులు ఇద్దరు ప్రజా నాయకులుగా ముందుకు వచ్చారు.
Tags: No Categories