ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పడ్డ కూటమి. –
టిడిపి బిజెపి సమన్వయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని బిజెపి అనేది ఒక బలమైన భావజాలం నుంచి ఉద్భవించిన పార్టీ. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడింది.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో బుధవారం జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి-బిజెపి కార్యకర్తల సమావేశానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: బిజెపి అనేది ఒక బలమైన భావజాలం నుంచి ఉద్భవించింది. దేశంపై, ప్రజలపై ప్రేమతో పుట్టిన పార్టీ బిజెపి. వాజ్ పేయి, అద్వానీ విలువలతో కూడిన రాజ నీతిజ్ఞులుగా పనిచేశారు. 2013-14 సమయంలో మోడీ పీఎం అవుతున్నారని తెలుసుకుని, సంతోషించిన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఒక స్వచ్ఛభారత్, మేకింగ్ ఇన్ ఇండియా వంటి నిర్ణయాలు, అమలు మోది వచ్చిన తర్వాతే సాధ్యమయ్యాయి. చట్ట సభలో తన బలమైన గళం వినిపిస్తున్నప్పుడు మోదీని చూసి మేమంతా చాలా గర్వపడ్డాం. దేశ, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ సమావేశం ద్వారా అందరినీ కలుపుకుని వెళ్లాలని, అందరితో కలిసి నడవాలని ఉద్దేశం మాకు బలంగా ఉందని అందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబుకు ఏపీ అంటే రెండు కళ్ళు ‘ఏ’ అంటే అమరావతి ‘పి’ అంటే పోలవరం. కానీ జగన్ కు మాత్రం ఏ అంటే ఆపడం ‘పీ’ అంటే పడగొట్టడం మాత్రమే. బిజెపి అంటే 0.8% కాదు మోడీ తలుచుకుంటే అది 80%కు కూడా చేరుకోవచ్చు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పడ్డ కూటమి. – టిడిపి బిజెపి సమన్వయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని ‘బిజెపి అనేది ఒక బలమైన భావజాలం నుంచి ఉద్భవించిన పార్టీ. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడింది.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో బుధవారం జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి-బిజెపి కార్యకర్తల సమావేశానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెమ్మసాని చంద్రశేఖర్ గారు. బిజెపి అనేది ఒక బలమైన భావజాలం నుంచి ఉద్భవించింది. దేశంపై, ప్రజలపై ప్రేమతో పుట్టిన పార్టీ బిజెపి. వాజ్ పేయి, అద్వానీ విలువలతో కూడిన రాజ నీతిజ్ఞులుగా పనిచేశారు. 2013-14 సమయంలో మోడీ పీఎం అవుతున్నారని తెలుసుకుని, సంతోషించిన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఒక స్వచ్ఛభారత్, మేకింగ్ ఇన్ ఇండియా వంటి నిర్ణయాలు, అమలు మోది వచ్చిన తర్వాతే సాధ్యమయ్యాయి. చట్ట సభలో తన బలమైన గళం వినిపిస్తున్నప్పుడు మోదీని చూసి మేమంతా చాలా గర్వపడ్డాం. దేశ, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ సమావేశం ద్వారా అందరినీ కలుపుకుని వెళ్లాలని, అందరితో కలిసి నడవాలని ఉద్దేశం మాకు బలంగా ఉందని అందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబుకు ఏపీ అంటే రెండు కళ్ళు ‘ఏ’ అంటే అమరావతి ‘పి’ అంటే పోలవరం. కానీ జగన్ కు మాత్రం ఏ అంటే ఆపడం ‘పీ’ అంటే పడగొట్టడం మాత్రమే. బిజెపి అంటే 0.8% కాదు మోడీ తలుచుకుంటే అది 80%కు కూడా చేరుకోవచ్చు.