సమస్యలపై దశలవారీ చర్యలు. + మంగళగిరి వాసులకు డాక్టర్ పెమ్మసాని స్పష్టత. ‘మాకు కళ్యాణ మండపం సమస్య ఉంది. మండపం నిర్మాణం చేసి ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటువైపు రావడమే మానేశారు.’ అని మంగళగిరిలోని 16వ వార్డుకు చెందిన ఓ మహిళ స్థానిక ఇబ్బందులను గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వివరించారు. మంగళగిరి పర్యటనలో భాగంగా గురువారం ఉదయం స్థానిక 14, 15, 16 వార్డుల్లో డాక్టర్ పెమ్మసాని పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో నిర్వహించిన డోర్ టు డోర్ పర్యటనలో భాగంగా నివాస ప్రాంతాలు, వస్త్ర, వాణిజ్య, వ్యాపార, కూరగాయల దుకాణాలలోని వ్యక్తులను ఆయన కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే ఆర్కే కారణంగా తలెత్తిన ఇబ్బందులపై వివరాలు సేకరించారు. పర్యటనలో భాగంగా కబేలా, టౌన్ హాల్, కళ్యాణమండపం తదితర సమస్యలపై స్థానికులు స్పందించారు. తమ సమస్యలను పరిష్కరించమని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ స్థానికులు తమ తమ సమస్యలను తెలిపారన్నారు. స్థానిక సమస్యల దృష్ట్యా దశలవారీగా పరిష్కారం చూపించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి టౌన్ టిడిపి అధ్యక్షుడు దామర్ల రాజు, టిడిపి మంగళగిరి సెక్రటరీ షేక్ రియాజ్, జనసెనా పార్టీ మంగళగిరి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు మునగపాటి మారుతీ రావు, చేనేత విభాగం జనసెన్ రాష్ట్ర కార్యదర్శి, జంజనం సాంబశివరావు, దుగ్గిరాల మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ కాండ్రు భాను కిశోర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తులిమిల్లి శ్రీనివాసరావు, నరసరావుపేట ఓబీసీ ఇన్చార్జి కొలివికారు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.