విజయమే లక్ష్యంగా పనిచేయాలి. + పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలతో డాక్టర్ పెమ్మసాని. ‘విజయమే లక్ష్యంగా 26 డివిజన్లలోనూ టిడిపి కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలి. పనిచేయకుండా ఫలితం ఎవరికీ దక్కదు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మాది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. గుంటూరులోని స్థానిక టిడిపి పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల, నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఏయే డివిజన్లలో ఏ కార్యకర్త, ఏ స్థాయిలో కష్టపడ్డారు అన్నది తాను స్వయంగా తెలుసుకుంటానని, పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా పిడుగురాళ్ల మాధవికి మెజారిటీ వచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రచార కార్యక్రమాల్లో, అధికారులతో, ఇతరత్రా సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే స్థానికంగా డివిజన్లో ఏ చిన్నపాటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పెమ్మసాని వివరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం టిడిపి అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, పశ్చిమ నియోజకవర్గం నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు (నాని), కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories