Events

Tadikonda Road Show
May 6, 2024    

Tadikonda Road Show

టిడిపి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు. తాడికొండ, ఫిరంగిపురం మండలాల పర్యటనలో పెమ్మసాని ‘ప్రజల ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంచాలి. ఒరిజినల more...
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
May 6, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
AS Kalyana Mandapam Christian Meeting
May 6, 2024    

AS Kalyana Mandapam Christian Meeting

Tags: No Categories
Guntur Aryavaishya meeting
May 5, 2024    

Guntur Aryavaishya meeting

05-05-24 సాయంత్రం 9 గంటలకు గుంటూరు పట్టణం లో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి డాక్టర్ శ్రీ రత్న గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వచ్చిన తరువాత , ఆర్యవైశ్య లకు వర్తించే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు సోదరులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు…

Tags: No Categories
Swamiji Apartment Meeting
May 5, 2024    

Swamiji Apartment Meeting

Tags: No Categories
Vaderula Atmiya Samavesam
May 5, 2024    

Vaderula Atmiya Samavesam

అవినీతి పాలన. + జగన్ ప్రభుత్వం పై బీసీ సమావేశంలో పెమ్మసాని విమర్శలు. ‘యావన్మంది వైసీపీ నాయకులు అవినీతి పరులుగా మారారు. చిలకలూరిపేట నుంచి వచ్చిన రజిని అక్రమ వసూలలో రికార్డు సృష్టించగా, అఖిలార్ రోశయ్య అక్రమ మైనింగ్ తో వేలకోట్లు వెనకేసుకున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏ-వన్ కన్వెన్షన్ హాల్లో బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ… పెమ్మసాని చంద్రశేఖర్ గారు: ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి నుంచి పోటీ చేస్తున్న విడుదల రజనీ గారికి ఏ అర్హత లేకపోయినా వైద్య శాఖ మంత్రిగా ఎలా నియమించారు? దళితుల కు చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించడం వల్ల ఆమెకు మంత్రి పదవి వచ్చింది. అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ వైద్యం అందించే డాక్టర్లను కూడా కొందరు అవినీతిపరులు వేధిస్తున్నారు. అదేమని అడిగితే ఫీజులు పెంచమని, పెంచిన ఫీజులను ప్రజలపై మోపమని సలహా ఇస్తున్నారు. పథకాలు ఇస్తున్నారు కదా! అని ఈ వైసీపీ నాయకులకు ఓట్లు వేస్తే ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి ప్రజలను వేధిస్తుంటారు. మరోవైపు వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న కిలారు రోశయ్య ప్రజలకు సంబంధించిన 700 ఎకరాల్లో అక్రమ గ్రావెల్ తవ్వి, అవినీతి సంపాదనకు పాల్పడ్డారు. ఈ ఇద్దరు నాయకులు అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్నారు. కానీ నేను కష్టాలను చూస్తూ పెరిగాను. కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చి, మీ ఎదురుగా ఇలా నిలబడగలిగాను. * ఎక్కడెక్కడ పనులు దొరికితే అక్కడకు పిల్లలతో సహా వెళ్లి పనులు చేసుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తులు మీరు. చదవకపోయినా ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల వంటి గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తులు మీరు. గడచిన ఐదేళ్లుగా ఆదాయాలు పెరగకపోయినా నిత్యవసరకుల ధరలు, పెట్రోలు, ఇతర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసే కొంతమంది కార్మికులు సాయంత్రానికి కొంచెం మద్యం తీసుకుందామంటే అవి కాస్తా ప్రాణాంతకమైన రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. ఇవాళ, రేపు ఒక తోపుడు బండి పైనా డిజిటల్ పేమెంట్లు జరుగుతుంటే, ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్ లకు ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది. నివాసాలు లేనివారికి ఇల్లు కల్పించడం లేదా టిట్కో నివాసాలు అందించడం వంటి సహకారాలు అందిస్తాం. పిడుగురాళ్ల మాధవి: గడిచిన ఐదేళ్లలో ఈ జగన్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. క్వారలను అన్యాక్రాంతం చేస్తూ తమ పార్టీ నాయకులకు ఈ వైసిపి ప్రభుత్వం కట్టబెట్టింది. వడ్డెర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి, వందల కోట్లను కేటాయించిన టిడిపి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ను కేటాయించి నయా పైసా నిధులు ఇవ్వకుండా అవమానిస్తుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వడ్డెరలను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తున్నారు. ఒక అసమర్థుడైన, అవినీతిపరుడైన నాయకుడు చేతిలో ఇటుక రాయి ఉంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ప్రజల తలలు పగల కొడుతుంది. అదే సమర్ధుడైన నాయకుడు చేతిలో పెడితే ఒక నూతన నిర్మాణానికి నాంది పలుకుతుంది. అందరికీ మంచి చేయాలని వచ్చిన పెమ్మసాని గారి వంటి నాయకులు, చట్ట సభల్లో గళం విప్పాలనుకునే నా వంటి వారిని గెలిపిస్తే, అభివృద్ధికి బాటలు వేస్తాం. * ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, పశ్చిమ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి బాబు, టిడిపి జిల్లా పార్టీ కన్వీనర్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Guntur East Kapu Athmiya Samvesam
May 5, 2024    

Guntur East Kapu Athmiya Samvesam

మంగళగిరి పట్టణం లో జరిగిన నందివేలుగు కో ఆపరేటివ్ సోసైటీ బ్యాంకు లబ్ధిదారులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ more...
Tags: No Categories
Fire Accident At Auto Nagar
May 5, 2024    

Fire Accident At Auto Nagar

ఇదీ వైసిపి బాగోతం. ఆటోనగర్ లోని టిడిపి ముస్లిం నాయకుల షాపులు దగ్ధం. more...
Tags: No Categories
Yadavs Meeting
May 5, 2024    

Yadavs Meeting

యాదవులకు అండగా టిడిపి + బీసీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని గుంటూరులోని స్థానిక ఏ కన్వెన్షన్ హాల్లో బీసీ సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. more...
Tags: No Categories
Yadav's Meeting
May 5, 2024    

Yadav's Meeting

యాదవులకు అండగా టిడిపి + బీసీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని గుంటూరులోని స్థానిక ఏ కన్వెన్షన్ హాల్లో బీసీ సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: యాదవ సోదరుల్లో ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత అన్న ఎన్టీఆర్, టిడిపికే దక్కుతుంది. ఈరోజుకు కూడా చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్లినా యాదవ సోదరుడైన యనమల రామకృష్ణుడిని తన పక్కనే ఉంచుకుంటారు. అది యాదవ సోదరులకు చంద్రబాబు గారి ఇచ్చే గౌరవం. కానీ జగన్ ను చూస్తే పక్కన పెట్టుకోవడం సంగతి దేవుడెరుగు, కనీసం యాదవులకు గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ పార్టీలో ఉన్న యాదవ సోదరుల కైనా కనీసం కుర్చీ వేసి గౌరవిస్తున్నారా! లేదా! ఆ నాయకులే చెప్పాలి. వైసీపీలోకి కొత్తగా వెళ్లిన నాయకులు ఎవరైనా సరే సజ్జల కుమారుడు భార్గవరెడ్డి ఎలా చెప్తే అలా వింటేనే పార్టీలో ఉండాలట! నేను రాజకీయాల్లోకి స్వార్థం కోసం రాలేదు, పదవుల కోసం రాలేదు. భగవంతుడిచ్చిన జ్ఞానంతో నా చుట్టూ ఉన్నవారికి మంచి చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. జీవితంలో పేదరికం నుంచి బయటపడలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న వారికి నాలాంటి వారి అవసరం ఉందని నమ్మి మీ ముందుకు వచ్చాను. పిడుగురాళ్ల మాధవి: ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాగా పనిచేసేందుకు సంసిద్ధమై వస్తున్నాం. మా సేవలు ఎప్పుడు గుర్తుండేలా పని చేయాలనేదే మా ధ్యేయం. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలానే బలమైన నిర్ణయంతో వస్తున్నాం. నాకు మీరు అందించే సహాయ సహకారాలను దృష్టిలో ఉంచుకొని మీ అందరి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్: యాదవులు ఏదైనా మాట ఇవ్వడానికి ఆలోచిస్తారేమో గాని, మాట ఇస్తే మాత్రం ప్రాణం పోయినా కట్టుబడి ఉంటారు. ఒకసారి సర్దుకుపోయి పని చేయడం మొదలుపెడితే విజయ తీరాలకు చేరేవరకు కృషి చేస్తాం. ఎన్డీఏ కూటమి విజయానికి మా సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అడక శ్రీనివాసరావు, యాదవ నాయకులు తట్టుకోల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
1 2 3 4 5 6 7 8 9 10 11 12

SunMonTueWedThuFriSat
2324252627281234567891011121314151617181920212223242526272829303112345
SunMonTueWedThuFriSat
2324252627281234567891011121314151617181920212223242526272829303112345
Search Tags...