Events

TV-5 Interview
March 10, 2024    

TV-5 Interview

Tags: No Categories
District Muslim Minority Cell meeting
March 10, 2024    

District Muslim Minority Cell meeting

ది. 10.3.2024 ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారితో జిల్లా మైనార్టీ విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది. గుంటూరు తూర్పు ఇంచార్జి మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు.. వైకాపా పాలనలో మైనార్టీ సోదరులకు ఆర్ధిక అభివృద్ధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు… మైనార్టీలు కుటుంబ పోషణ నిమిత్తం ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కళ్ళు చెమ్మగిల్లాయన్నారు. నిరుపేద మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం సదరు పధకాలను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా మైనార్టీలకు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలే కాక… నా సొంతగా కూడా మైనార్టీలకు చేయూతగా ఉంటానని తెలిపారు… పాఠశాలలు ప్రారంభిస్తాను, నీటి కొరత సమస్యకు పరిష్కారం తీసుకొస్తాను, రోడ్లు బాగుచూపిస్తాను, డ్రైనేజి సమస్యను పరిష్కరిస్తాను. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్ధాల అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నాడు… దీనిపై మనందరం పోరాడదామని తెలిపారు..
Padayatra
March 9, 2024    

Padayatra

Embark on an enriching journey with us as we organise a Padhayatra. This walking pilgrimage offers a unique opportunity to connect with our surroundings, promote health and well-being, and foster community unity.
Tags: No Categories
Interaction meet with Guntur District Legal cell members
March 9, 2024    

Interaction meet with Guntur District Legal cell members

Join us for an engaging Interaction Meet with Guntur District Legal Cell members, as we discuss pertinent issues and strategies for the upcoming election.
ETV Interview
March 9, 2024    

ETV Interview

గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు అదే బుర్రిపాలెం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలు, విధ్వంసం చూసి వాటిని ఎదుర్కొనేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి గుంటూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన… రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలుస్తానని విశ్వాసం వెలిబుచ్చారు. విద్య, ఉపాధి రంగాల్లో ఈ ప్రాంతాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని, ప్రవాసాంధ్రుల సహకారంతో సేవా కార్యక్రమాల్ని విస్తరిస్తానంటున్న పెమ్మసానితో ఈటీవీ ముఖాముఖి..

Tags: No Categories
Visited Pedakakani Malleswara Swamy on the Occasion of Shivratri festival
March 8, 2024    

Visited Pedakakani Malleswara Swamy on the Occasion of Shivratri festival

మల్లేశ్వరస్వామి దర్శనంలో డా. పెమ్మసాని. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకాకాని మల్లేశ్వర స్వామిని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. పిదప స్వామి ప్రసాదాలను పెమ్మసాని స్వయంగా భక్తులకు అందజేశారు.
Hosanna - Christian Meeting
March 8, 2024    

Hosanna - Christian Meeting

ఈ స్థలం పవిత్రమైనది ….
పెమ్మసానిఈ స్థలం పవిత్రమైనదని దీనిని బలపరిచిన హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్లు ను అభినందిస్తున్నట్టు తెలిపారు. 1977లో 80 మందితో మొదలైన పండుగ నేడు నాలుగు లక్షల మందికి చేరుకున్నారంటే దాని వెనుక ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉన్నాయని సందేశం ఇచ్చారు.శాంతి ప్రేమ పంచడానికి ఏసుక్రీస్తు జన్మించారని ఆయన మార్గంలో నడవాలని కోరారు .చిన్నప్పటి నుంచి పండుగ గురించి అనేకమార్లు విన్నాను…
మొదటిసారిగా చూస్తున్నానని నా జీవితంలో నేను చూసిన పెద్ద పండుగ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుని ఆశీర్వాదం పొంది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రహం.. చీఫ్ మినిస్టర్ జాన్ వెజ్లీ పాస్టర్లు రాజు… రమేష్.. పైడి పాలు.. చేసిన ప్రార్థన లో ఆయన పాల్గొని ఆశీస్సులు పొందారు.
TDP Janasena Padayatra-Tenali
March 7, 2024    

TDP Janasena Padayatra-Tenali

 టిడిపి – జనసేన పార్టీల ఆధ్వర్యంలో గురువారం తెనాలిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పెమ్మసాని తో పాటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి కాలినడకన మొదలైన ఈ ప్రచారం పాత స్వరాజ్య థియేటర్ మీదుగా బోస్ రోడ్, గాంధీ చౌక్, షరాఫ్ బజార్ గుండా మున్సిపల్ కాంప్లెక్స్ వరకు సాగింది. ప్రచారం జరుగుతున్న ప్రతిచోట వ్యాపారులు, యువత, మహిళలు, వృద్ధులు ఇరు పార్టీల నాయకులకు స్వాగతం పలికారు. నవయుగ హోటల్ సెంటర్ వద్దకు చేరేసరికి టిడిపి – జనసేన శ్రేణులు ఎక్స్ కవేరేటర్ సహాయంతో భారీ గజమాలను డాక్టర్ పెమ్మసాని, నాదెండ్లకు మెడలో వేసి గౌరవించారు. కాగా మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత నాయకులు తమ ప్రచారాన్ని ముగించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అ నుంచి అం, అ: వరకు జగన్ తప్పులు చేసుకుంటూ వెళ్లారని చెప్పారు. ‘అ అంటే అంగన్వాడీలకు అన్యాయం, ఆ అంటే ఆరోగ్యశ్రీ కి ద్రోహం, ఇ అంటే ఇసుక దోపిడీ, ఉ అంటే ఉద్యోగాలు లేకపోవడం’ వంటి ఎన్నో లెక్కలేనన్ని పాపాలు చేశారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో నగర, నియోజకవర్గ కార్యకర్తలు ఇరు పార్టీల శ్రేణులతో పాటు ప్రజలు కూడా కలిసి నడిచారు.
07 Mar
March 7, 2024    

Ward members meet

*రత్నాల పేరిట రాళ్లు పెట్టారు. * తెనాలి డివిజన్ నాయకుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని. ‘ఎన్నికలకు ముందు రత్నాలు పేరు చెప్పి రాళ్లు పెట్టిన ఘనత ఈ వైసీపీకే చెల్లుతుంది, తెనాలి నియోజకవర్గ, గుంటూరు జిల్లా పరిధుల్లో వైసీపీ వాసనే ఉండకూడదు.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని స్థానిక ఎన్వీఆర్ కళ్యాణమండపంలో గురువారం జరిగిన డివిజన్ నాయకుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో డా. పెమ్మసాని, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కష్టాన్ని తాను స్వయంగా గుర్తిస్తానని, కష్టపడ్డ వారెవరు? తప్పు చేసింది ఎవరు అనేది తెలుసుకోవడం తనకు కష్టమేమీ కాదని తెలిపారు. జనసేనలో రెండో స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ కు అవకాశమిస్తే నియోజకవర్గానికి మంచి జరుగుతుందని తెలిపారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ పాలన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం విధ్వంసంతో మొదలు పెట్టిందని అన్నారు. తొలుత దామోదర సంజీవయ్య మొదలుపెట్టిన పించన్ విధానాన్ని, అన్న ఎన్టీయార్ ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారన్నారు. కానీ ఈ జగన్ మాత్రం బటన్ నొక్కడమే అభివృద్ధి అనుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందుగా డివిజన్ నాయకులను పెమ్మసాని, మనోహర్ కు వార్డుల వారీగా పరిచయం చేశారు.

A visit to Jain Temple
March 7, 2024    

A visit to Jain Temple

On 7th of March Dr Pemmasani Chandrasekhar visited Jain Temple and interacted with the Temple members.
22 23 24 25 26 27 28 29 30 31 32