Events

Food Welfare Meet at Tenali
March 28, 2024    

Food Welfare Meet at Tenali

Pemmasani Visit Tenali Food Welfare Association.Meeting is Conducted to discuss various Food issues of Tenali.
Tenali Road Show
March 28, 2024    

Tenali Road Show

 తెనాలి నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పెమ్మసాని, నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి పాల్గొన్నారు. రోడ్ షోలో భాగంగా దారి పొడవునా ప్రజలతో మమేకమవుతూ, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఇరువురు అభ్యర్థులు ముందుకు సాగారు. రోడ్ షో లో ఉన్న పెమ్మసానిపై పూల వర్షం కురిపిస్తూ, పల్లెచోట్ల భారీ గజమాలలు, శాలువాలతో ఆయన్ను ప్రజలు గౌరవించారు. తర్వాత పెమ్మసాని మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే తాము ప్రచార యాత్రకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ సభకు వచ్చినట్లు ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ఏకమయ్యాయని, ప్రజలందరూ ఈ పొత్తును స్వాగతించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధమని చెప్పిన పవన్ కళ్యాణ్ మార్గాన్ని అనుసరించడానికి తాను కూడా ఎప్పుడు సిద్ధమేనని చెప్పారు. ఈ పర్యటనలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Tenali Parliament Office Opening
March 28, 2024    

Tenali Parliament Office Opening

తెనాలిలోని కొత్తపేటలో పార్లమెంటరీ టిడిపి కార్యాలయాన్ని డాక్టర్ పెమ్మసాని, తెనాలి నియోజవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ యువతను గంజాయి, కల్తీ మద్యం మత్తులో ఉంచుతూ ఈ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని తెలిపారు. రూ. 70 వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై అప్పట్లో టిడిపి దృష్టి పెట్టిందని, ఆ ఫలితంగానే పట్టిసీమ ప్రాజెక్టు నేటి గుంటూరు జిల్లా రైతాంగానికి ఉపయోగపడుతుందని వివరించారు. ప్రజా సమస్యలు, కష్టాలను చూసి టిడిపి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ‘సూపర్ సిక్స్’ ప్రవేశపెట్టారని పెమ్మసాని గారు తెలిపారు. వంటి పథకాలతో సుభిక్షమైన పాలనకు టిడిపి, జనసేన, బీజేపీ ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆలోచనలు అటు ఇటు అయితే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tenali Doctors Meet
March 28, 2024    

Tenali Doctors Meet

 తెనాలిలోని గ్రాండ్ గౌతమ్ హోటల్లో గురువారం రాత్రి జరిగిన డాక్టర్స్ మీట్ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సమస్యలు, వేధింపుల వికృత రాజకీయాల మధ్యన ఏపీలో పనిచేస్తున్న వైద్యులు నిజంగా గొప్పవారని తెలిపారు. రాజకీయ, రాజకీయేతర ఎలాంటి సమస్యలు ఉన్నాసరే వైద్యులకు తాను ఎల్లపుడూ అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. టిడిపిని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి, టిడిపి సత్తా ఏంటో చూపించాలని తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ముందుంటానన్నారు. నలుగురిని బెదిరిస్తే, వేధిస్తేనో చాలు, పాలన చేయవచ్చని వైసిపి భ్రమ పడుతుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో గంజాయి సంస్కృతి మితిమీరి పోయిందని, వల్లభాపురం, కొల్లిపర వంటి పచ్చని ప్రాంతాల్లోనూ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన క్రమంలో ఆయనను, ఆయన కుటుంబాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ప్రభుత్వం ఎన్నో వేధింపులకు గురి చేసిందని, పవన్ ను సైతం అనేక సందర్భాల్లో వేదించిన ఘటనలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి అరాచక పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడిందన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్ఫూర్తిగా పోరాడే వైద్యులకు మనోహర్ తన ధన్యవాదాలు తెలిపారు.
Pedhanandhipadu IftarVindh
March 27, 2024    

Pedhanandhipadu IftarVindh

పేదల ఆకలి బాధ తెలియజేసే రంజాన్. * పెదనందిపాడు ఇఫ్తార్ విందులో డాక్టర్ పెమ్మసాని. ‘పేదల ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలియాలనే ఉద్దేశంతో అల్లా పెట్టిన సంస్కృతి పేరే ఈ రంజాన్.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెదనందిపాడు మండల కేంద్రంలో స్థానిక ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒక పండగ చేసుకునే ముందు ఆ పండగ పవిత్రత గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని ఆయన అభిలాషించారు. పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఈ ఇఫ్తార్ విందులో రాజకీయం మాట్లాడడం తనకి ఇష్టం లేదన్నారు. దురదృష్టవశాత్తు నేటి సమాజంలో అధిక శాతం ముస్లింలు పేదరికంలో మగ్గిపోతున్నారని, అలాంటి వారికి తాను వీలైనంత సాయం అందిస్తారని పెమ్మసాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ‘చీకటిని వదిలి వెలుగులోకి నడవండి, చెడును వీడి అభివృద్ధిలోకి వెళ్ళండి.’ అన్న అల్లాహ్ ఆదేశానుసారం ప్రతి ఒక్క ముస్లిం అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి నాయకులు సీతారామయ్య, గుంటూరు ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Guntur West visit
March 27, 2024    

Guntur West visit

ట్రాన్స్ జెండర్ ల సమస్యలు పరిష్కరిస్తాం. * 21వ డివిజన్ పర్యటనలో డాక్టర్ పెమ్మసాని ‘చంద్రబాబు నాయుడు హయాంలో అందించిన పెన్షన్లతో పాటు ఇళ్ల స్థలాలు అందించాలని ట్రాన్స్ జెండర్లు కోరుతున్నారు. టిడిపి ప్రభుత్వం రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 21వ డివిజన్లలోని, శ్రీనివాసరావు తోట ప్రాంతంలో గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి కలిసి బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ స్థానిక సమస్యలను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు.
Dr Pemmasani's Public Programs
March 27, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Door to Door campaign in Sharaaf Bazar
March 27, 2024    

Door to Door campaign in Sharaaf Bazar

 మంగళగిరి పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై డా. పెమ్మసాని ఫైర్ ‘వైసీపీ అధినేత మాదిరిగానే ఆ పార్టీ నాయకులూ అరాచకాలు సృష్టిస్తున్నారు. అర్చకులను, ముస్లిం మహిళలు, చేనేత కుటుంబాలను వేధింపులు, హింసలకు గురి చేస్తున్నారు. భౌతిక దాడులు మొదలు ప్రాణాలు తీసేవరకు తెగిస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మంగళగిరిలోని స్థానిక షరాఫ్ బజార్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి స్వర్ణకారులు, వర్తక, వ్యాపారులను కలిసి మాట్లాడారు. వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ పర్యటనలో భాగంగా పలువురు వర్తక వ్యాపారులను, స్వర్ణకారులను కలుసుకున్న నేపథ్యంలో లోకేష్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని అర్థమైందని తెలిపారు. లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు, వ్యాపారులకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు.  పర్యటనలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య, టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ దామర్ల రాజు, జనసేన మంగళగిరి జనసేన అధ్యక్షులు షేక్ కైరుల్లా, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిసెట్టి జానకీ దేవి తదితరులు పాల్గొన్నారు.
Mahaa TV Interview
March 27, 2024    

Mahaa TV Interview

Tags: No Categories