Events

Youth empowerment exchange program
March 31, 2024    

Youth empowerment exchange program

నాకు ఎదురైన ప్రశ్నలకు నేనే సమాధానం. * యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని ‘ఎవరు ఎన్ని చెప్పినా ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక స్పష్టత, ధైర్యం ఉండాలి. రాజకీయాల్లోకి వస్తున్నాను అనగానే నాకు ఎదురైన ఎన్నో ప్రశ్నలకు నేనే సమాధానంగా నిలిచాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. నగరంలోని అమరావతి రోడ్డులో గల ఏ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన యూత్ ఎంపవర్మెంట్ ఎక్స్చేంజ్ – 2024 కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేవలం కలలు కనడం ఒకటే విజయానికి మార్గం కాదని కార్యాచరణ, పక్కా ప్రణాళిక ముఖ్యమని చెప్పారు. తాను ఈరోజుకీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడతానని, తనకు ఉన్న డెడికేషన్ కు తానే ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా తెలియజేశారు. యువత సినిమా, క్రికెట్, సోషల్ మీడియా అంటూ సమయం వృథా చేయకుండా లక్ష్యాన్ని చేరువ అయ్యేందుకు ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. ఒక సినిమా చూసే సమయంలో ఒక మంచి పుస్తకం చదివి కానీ, ఒక స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూలు చూసి ప్రేరణ పొందడం వల్ల కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టవచ్చు అని తెలిపారు.  కార్యక్రమం అనంతరం వారి వారి రంగాల్లో నిపుణులైన పలువురికి ముఖ్యఅతిథిగా పెమ్మసాని ప్రోత్సాహకాలు అందజేసి సత్కరించారు.
Dr Pemmasani's Public Events
March 31, 2024    

Dr Pemmasani's Public Events

Tags: No Categories
walking track visit-Koritepadu
March 31, 2024    

walking track visit-Koritepadu

మార్నింగ్ వాక్ విత్ పెమ్మసాని. * వాకింగ్ ట్రాక్ లను పరిశీలించిన డాక్టర్ పెమ్మసాని. ‘యాంత్రిక జీవనంలో ప్రతి మనిషికి వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామానికి అవసరమైన యాంత్రిక సామగ్రిని ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నగరంలోని స్థానిక కొరిటేపాడు బ్యాంకు బండ్ వాకర్స్, గుజ్జన గుండ్ల వాకర్స్ గ్రౌండ్ లను పెమ్మసాని ఆదివారం పరిశీలించారు. వ్యాయామంలో భాగంగా ఆయన గ్రౌండ్ కు వెళ్లి అక్కడి వాకర్లతో మాట్లాడుతూ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వాకర్లు పెమ్మసానితో మాట్లాడుతూ గతంలో గ్రీన్ ఆంధ్ర తరఫున రూ. 3.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆయా నిధులతో నగరంలోని వాకర్స్ గ్రౌండ్లలో స్ట్రీట్ లైట్లు గ్రౌండ్ లెవెల్ వాటర్ సౌకర్యం తదితరాలను ఏర్పాటు చేయడానికి అప్పట్లో అధికారులు ప్రయత్నించారు కానీ చేయలేదు అని వివరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ నగరంలోని వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేస్తే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది అని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాకింగ్ ట్రాక్లలో బ్యూటిఫికేషన్ చేపట్టే బాధ్యత తీసుకుంటామని అలాగే వాకింగ్ ట్రాక్ల కోసం విడుదలైన ప్రతి రూపాయిని వాటి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
KL Universtiy Students Interview
March 31, 2024    

KL Universtiy Students Interview

Tags: No Categories
Roadshow at-Hussain nagar , Saibaba nagar
March 30, 2024    

Roadshow at-Hussain nagar , Saibaba nagar

ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయం. * తూర్పు నియోజకవర్గం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించిన టిడిపి 40 ఏళ్లుగా అదే ఆశయంతో ముందుకు నడుస్తుందని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 14, 15 డివిజన్లలో పెమ్మసాని గారు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నసీర్ అహ్మద్ తో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా హుస్సేన్ నగర్, ఇందిరా కాలనీ, ఐపిడి కాలనీ వంటి పలు ప్రాంతాల్లో ఆయన తన పర్యటనను కొనసాగించారు. పర్యటన ముగింపు అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కొరత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముందుగా ప్రజా సమస్యలపైనే దృష్టి పెడతామని ఆయన స్పష్టం చేశారు.  పర్యటన ఆసాంతం డివిజన్లలోని ప్రజలు ఇరువురు నాయకులకు స్వాగతం పలికారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మరీ పెమ్మసానికి, నజీర్ కు అభివాదాలు చేస్తూ, టిడిపి విజయానికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. పలుచోట్ల పెమ్మసాని, నసీర్ కు ప్రజలు హారతులు పట్టి విజయ తిలకం దిద్దారు. ఈ పర్యటనలో 14, 15 డివిజన్ లో ప్రెసిడెంట్లు బెమ్మసాని శీను, సూరే శీను, క్లస్టర్ ఇంచార్జ్ మల్లంపూడి శ్రీనివాస్ తో పాటు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories
New Markaz mazjid-Namaz
March 30, 2024    

New Markaz mazjid-Namaz

ముస్లింలకు అండగా ఉంటా.
* రోజా విరమణ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని.ముస్లిం సోదరులకు అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా పెమ్మసాని చూసుకుంటారు అనే ధైర్యం కల్పిస్తానని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక పొన్నూరు రోడ్లో గల లాల్ తలాబ్ మసీదులో జరిగిన రోజా విరమణ కార్యక్రమంలో పెమ్మసాని శనివారం పాల్గొన్నారు. మసీద్ మౌలానాలతో కలిసి నమాజ్ లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి రోజా విరమణ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలతో ముస్లిం సోదరులు పాటించే నియమ నిబంధనలు మానవాళికి మార్గదర్శకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.
Tags: No Categories
Interaction with Vignan Nirula students
March 30, 2024    

Interaction with Vignan Nirula students

మహిళలు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి. * ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థినులతో మాట్లాడుతూ డాక్టర్ పెమ్మసాని. ‘కిరణ్ మజుందర్ షా, ఇంద్ర నూయి వలె మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెద పలకలూరు లోని విజ్ఞాన్ నిరుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీలో శనివారం జరిగిన పరిచయ కార్యక్రమానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు భవిష్యత్తులో ఏ బాధ్యతలు చేపట్టిన ప్రతి అంశంలోను నెంబర్ వన్ గా ఎదగాలని సూచించారు. తాను ఈరోజు ఇంత హుందాగా ఉండడానికి తన తల్లి, భార్య ప్రధాన కారణమని తెలిపారు. అతి తక్కువ మంది మహిళలు మాత్రమే దేశంలో ప్రెసిడెంట్ స్థాయికి వెలగలుగుతున్నారని, ఒకవేళ వెళ్లిన ఎక్కువ చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. ఓటు హక్కు తొలిసారి ఉపయోగించుకునే ముందు మహిళలు ఒక్కసారి ఆలోచించి అభివృద్ధికి ఉపయోగపడే నాయకులను ఎన్నుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కును ఎన్టీఆర్ అందిస్తే చంద్రబాబు నాయుడు మహిళా సాధికారికతను అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కొర్రపాటి నాగేశ్వరరావు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూర్మనాథం తదితరులు పాల్గొన్నారు.
Door to Door campaigning - GunturEast
March 30, 2024    

Door to Door campaigning - GunturEast

పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం. * బంగారు వర్తక, వ్యాపారులతో డాక్టర్ పెమ్మసాని. పండ్ల మార్కెట్, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని స్థానిక లాలాపేట్, పండ్ల మార్కెట్, బంగారపు కోట్ల బజార్ తదితర ప్రాంతాల్లో పెమ్మసాని, తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వర్తక వ్యాపారులను కలిసిన ఆయన టిడిపి ప్రభుత్వం వస్తే ఏం చేయదల్చుకుంది అన్న అంశంపై అందరికీ అవగాహన కల్పించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ లోని పథకాలను అందరికీ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరులో పలు సమస్యలు ఉన్నాయని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Lalpet fruit market visit
March 30, 2024    

Lalpet fruit market visit

పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం. * బంగారు వర్తక, వ్యాపారులతో డాక్టర్ పెమ్మసాని.పండ్ల మార్కెట్, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని స్థానిక లాలాపేట్, పండ్ల మార్కెట్, బంగారపు కోట్ల బజార్ తదితర ప్రాంతాల్లో పెమ్మసాని, తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వర్తక వ్యాపారులను కలిసిన ఆయన టిడిపి ప్రభుత్వం వస్తే ఏం చేయదల్చుకుంది అన్న అంశంపై అందరికీ అవగాహన కల్పించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ లోని పథకాలను అందరికీ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరులో పలు సమస్యలు ఉన్నాయని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.