![Ekalavy Statue Meeting](https://drpemmasani.com/wp-content/uploads/2024/04/DSC2537-scaled.jpg)
Ekalavy Statue Meeting
ఆర్థిక అసమానతలు రూపుమాపాలి. + తెనాలి, ఏకలవ్య నగర్ లో ప్రజలతో మాట్లాడిన పెమ్మసాని. ‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక మూడో వార్డులో గల ఏకలవ్య నగర్ లో స్థానికులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ సంక్షేమం పేరిట రూ. 5-10 వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల జీవన విధానం మారదు అని చెప్పారు. ఒక వ్యక్తి అర్హతలను బట్టి స్వయంగా సంపాదించుకొనే అవకాశాలు కల్పించినప్పుడే ఒక కుటుంబం గానీ సమాజంగానే అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కారణంగా ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. నాయకులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని జగన్ పాలనలో మూడో కృష్ణుడు వెనుక నుంచి ‘ఎస్’ అంటేనే పనులు జరిగే దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అలాగే తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల జీవనోపాధికి సంబంధించి ప్రజాస్వామ్యం హక్కు కల్పించిందని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో చేతివృత్తులు, వృత్తిపై ఆధారపడి బతికే వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజల జీవనోపాధికి ఉపయోగపడేలా రాబోయే రోజుల్లో ప్రణాళికలు రచిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు లీలా శంకర్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు గోపీచంద్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
![Eid Gaa at Urdu School](https://drpemmasani.com/wp-content/uploads/2024/04/DSC2442-1-scaled.jpg)
Eid Gaa at Urdu School
రంజాన్ పర్వదినం సందర్భంగా గుంటూరులోని ఉర్దూ స్కూల్, ఆంధ్ర ముస్లిం కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నసీర్ అహ్మద్ గారు…
![Tadikonda Roadshow](https://drpemmasani.com/wp-content/uploads/2024/04/DSC7211-scaled.jpg)
Tadikonda Roadshow
టిడిపికి కంచు కవచంలా నిలబడతాం.మీ ముది మనవడు కూడా టిడిపిని టచ్ చేయలేరు. గుంటూరుకు నువ్వు రా! నేను సిద్ధం.జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన పెమ్మసాని. ‘టిడిపిని జగన్ తక్కువ అంచనా వేశారు.మీరు కాదు కదా, మీ ముది మనవడు కూడా టచ్ చేయలేరు. టిడిపి, చంద్రబాబు, లోకేష్ కు, కంచు కవచంలా అడ్డం నిలబడతాం.’ అని అధికార పార్టీ పై గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి డాక్టర్ పెమ్మసాని గారు రోడ్ షోను బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం దామరపల్లి, పొన్నెకల్లు గ్రామాల్లో ఆయన పర్యటించారు. దారి పొడవున పూలవర్షంతో గ్రామస్తులు స్వాగతం పలుకగా, పలు కూడళ్ళలో ఎక్స్ కవేటర్ల సహాయంతో భారీ గజమాలతో ప్రజలు తమ ఊళ్ళలోకి ఆహ్వానించారు. కాగా అనంతరం పొన్నెకల్లు ప్రచార ముగింపు సభలో పెమ్మసాని ప్రసంగించారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 16 నెలలపాటు జైల్లో ఉండి వచ్చిన జగన్ లో మార్పు వచ్చి ఉంటుందని నమ్మి అప్పట్లో ప్రజలు భావించారని, అందుకే 151 సీట్లతో అధికారంలో కూర్చోబెట్టారు అన్నారు. అయితే కృతజ్ఞత తీర్చుకోవాల్సిన జగన్ ప్రజలపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టారని, ప్రజా వేదిక కూల్చివేతతోనే ఆయన తన అరాచక పాలన ప్రారంభించారని విమర్శించారు. మద్యం – అరాచకం. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఎంతోమంది నాయకులు, పెద్దల వద్దకు వెళ్లి పరిశ్రమలు, హాస్పిటళ్ళు, రిహాబిలిటేషన్ సెంటర్లు వంటి 120 సంస్థలను తీసుకువచ్చారని చెప్పారు. కానీ ఆ సంస్థలను రద్దు చేసిన జగన్ ఏపీలో నాసిరకం, కల్తీ మద్యాన్ని అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. మద్యం కనిపెట్టిన వాళ్లకే అర్థం కాని బ్రాండ్లు తయారుచేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. రూ. 60 లు ఉండే మద్యం బాటిల్ ధరను రూ. 200 చేసిన జగన్, అందులో 70 శాతం వాటాలను తన తాడేపల్లి ప్యాలెస్ కు తరలిస్తున్నారని విమర్శించారు. మందుబాబుల బలహీనతలను అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్న సొమ్ముతో ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమానంగా జరిగిన రోజే ప్రజాస్వామ్యంలో ప్రజలు గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోగలరని తెలిపారు. కన్స్ట్రక్షన్ కావాలి – డిస్ట్రక్షన్ కాదు. ‘మా గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, అరాచకం కాదు. కన్స్ట్రక్షన్ కావాలి, డిస్ట్రక్షన్ కాదు. టిడిపిని ఓడిస్తే ఇక తిరుగులేదని పిచ్చి భ్రమలో ఉన్న జగన్ కు ఒక్కటే చెప్తున్నాను, టిడిపి – చంద్రబాబు -లోకేష్ కు మేమంతా కంచు కవచంలా అడ్డం నిలబడతాం. జగన్…. ఆయన తండ్రిగారు, తాతగారే కాదు, ముది మనవడు కూడా మా టిడిపిని టచ్ చేయలేరు. వాళ్లు వీళ్లు కాదు, దమ్ముంటే గుంటూరుకు నువ్వు రా జగన్. నీ క్యాండిడేట్ వెళ్ళిపోతాను అంటున్నారు కదా! మాట మాట్లాడితే అభ్యర్థిని మారుస్తున్నావు కదా! ఇప్పటికి నలుగురిని మార్చారు, ఐదో వాడిగా నువ్వు రా! జగన్… నేను సిద్ధం.’ అని జగన్, వైసీపీ ప్రభుత్వానికి పెమ్మసాని ప్రజా సమక్షంలో సవాల్ విసిరారు. జగన్ చేసే అప్పు మన నెత్తినే పడుతుంది – తెనాలి శ్రావణ్ కుమార్. ‘ప్రజల్లో జగన్ చేసే అప్పులపై కొన్ని అపోహలు ఉన్నాయి. రాష్ట్రంలో అప్పులు చేస్తుంది జగన్ కదా! మనకేం ఇబ్బంది వస్తుందిలే అని ప్రజలు అనుకుంటే పొరపాటే. మనం ప్రతి నెలా చెల్లిస్తున్న కరెంటు బిల్లులు, పెట్రోల్ ధరలు, పన్నులు దశలవారీగా పెంచిన జగన్, ఆ అప్పులను ప్రస్తుతం మన నుంచే వసూలు చేసే పనిలో ఉన్నారని గుర్తించాలి. ఏ రాష్ట్రంలో లేనంత జీఎస్టీ ఏపీలో మాత్రమే ఉంది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో మనకంటే తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. ఒక్కసారి ప్రజలంతా టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోండి. మంచి నాయకత్వానికి ఓటేసి అమరావతిని నిలబెట్టుకోవాలి.’ అని తాడికొండ నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వైసీపీకి చెందిన ముప్పై కుటుంబాలు టిడిపి, బిజెపి పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి డాక్టర్ పెమ్మసాని, శ్రావణ్ కుమార్, బిజెపి నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విజయ్ శేఖర్, టిడిపి నాయకులు డాక్టర్ శేషయ్య, అలాగే మండల నియోజకవర్గస్థాయి టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.
![Ponnur Road Show at Nambur](https://drpemmasani.com/wp-content/uploads/2024/04/DSC01757-1-scaled.jpg)
Ponnur Road Show at Nambur
కొందరి అవినీతి వల్లే నీటి సమస్య.పెమ్మసాని ఆధ్వర్యంలో ఉప్పలపాడు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ‘కేవలం అవినీతి అధికారులు, నాయకులు చేసిన కక్కుర్తి వలన గుంటూరు కార్పోరేషన్ పరిధిలో నీటి సమస్య తలెత్తింది. ఎన్నికలు పూర్తి కాగానే ఒక్కొక్కరి భాగోతం బయటపెడతాను, నీటి సమస్య పరిష్కరిస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. పెదకాకాని మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని తక్కెళ్ళపాడు, వెంకట కృష్ణాపురం, ఉప్పలపాడు, నంబూరు తదితర గ్రామాలలో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ ఉప్పలపాడులో సహకరిస్తున్న కార్యకర్తలను, ప్రజలను చూస్తుంటే అసలు ఈ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదనిపిస్తుంది అని తెలిపారు. పాదయాత్రకు వచ్చిన జగన్ ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లారే తప్ప, ఐదేళ్లుగా జనం మొహం చూడడం మానేశారని ఎద్దేవా చేశారు. ఆయనేమో ఏసీ బస్సులో తిరుగుతూ, ప్రజల్ని అవస్థల పాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన వారికి డాక్టర్ పెమ్మసాని, దూలిపాళ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ధూళిపాళ్ల మాట్లాడుతూ గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు టిడిపి హయాంలో వేసిందే తప్ప ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఒక్క రోడ్డు కూడా నిర్మింపబడలేదని తెలిపారు. నీళ్లు ఇవ్వలేక సర్పంచ్, అధికారులు తిప్పలు పడుతున్నారని, నాలుగేళ్ల పది నెలలుగా చేయని నీటి సరఫరా కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. గుంటూరు ఛానల్ కు నిధులు సేకరించిందని జగన్ ప్రభుత్వం వచ్చాక తనకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఇప్పుడు రద్దుకు సిద్ధంగా ఉన్న పరిస్థితులు చూసి కూడా జగన్ స్పందించడం లేదన్నారు.మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తా. + సీఎంగా ఉండి గంజాయిని అరికట్టలేవా? + నంబూరు పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. ‘నాపై చూపించే అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తా. బుద్ధి ఉన్న ఏ ఒక్కరు వైసీపీకి ఓటు వేయరు. నాసిరకం మద్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఎవరు తాగమన్నారని నిర్లక్ష్యంగా మాట్లాడే ఈ జగన్ కు సీఎంగా ఉండే అర్హత ఉందా?’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెదకాకాని మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తక్కెళ్ళపాడు, వెంకట కృష్ణాపురం, గోళ్లమూడి, ఉప్పలపాడు, నంబూరు తదితర గ్రామాల్లో డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. పొన్నూరు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచారంలో పెమ్మసాని, నరేంద్ర గారికి యావన్మంది ప్రజలు ఆహ్వానం పలికారు. దారి పొడవునా ఇరువురు నాయకులను పూల వర్షంలో ముంచెత్తారు. కాగా నంబూరు లో జరిగిన ముగింపు ప్రజాసభలో పెమ్మసాన్ని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో చెట్లు నరికిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మాత్రమే అన్నారు. ఓటేసే ముందు గుణం నాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వం చూడకుండా ఓటేస్తే అభివృద్ధి ఇలాగే కొంటుపడుతుందని ఆయన ఉదహరించారు. రైతులకు రెండు పంటలకు కూడా నీళ్లు ఇవ్వాలన్న ప్రణాళిక లేని సీఎంగా జగన్ ఉండి ఎవరికి ఉపయోగమని నిలదీశారు. తాకట్టు పెట్టడానికి రాష్ట్రంలో ఏమీ మిగలక, రాబోయే రెండేళ్లలో ప్రజలు తాగబోయే మద్యంపై కూడా ఈ జగన్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక సీఎంగా ఉండి గంజాయిని కూడా అరికట్టలేవా? అని సభాముఖంగా పెమ్మసాని జగన్ ను ప్రశ్నించారు. అనంతరం ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ నంబూరులో కార్యకర్తల ఉత్సాహం చూస్తే వైసిపి నాయకులకు మరిగిపోతూ ఉంటుందేమోనని అన్నారు. 2014-19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే నంబూరు కి కనెక్టివిటీ హైవే, గొల్లగూడెం రోడ్డు, నంబూరు నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా రోడ్లు వేసింది కూడా టిడిపినే అన్నారు. గుంటూరుగుంటూరు ఛానల్ పై డబుల్ వంతెన, మసీదులు నిర్మించినా, జీతాలు ఇచ్చినా, దుల్హన్ పథకం ఇచ్చినా అది టిడిపి ఆధ్వర్యంలోనే జరిగిందని వివరించారు. నంబూరు నడిబొడ్డున నిలబడి తామిచ్చిన పెన్షన్లు, వేసిన రోడ్లు, అభివృద్ధి పై సవివరంగా స్పష్టం చేయగలమని ఆయన వివరించారు. అవినీతి వల్లే గుంటూరుకు నీటి సమస్య – ఉప్పల వాడలో పెమ్మసాని. ‘కేవలం అవినీతి అధికారులు, నాయకులు చేసిన కక్కుర్తి వలన గుంటూరు కార్పోరేషన్ పరిధిలో నీటి సమస్య తలెత్తింది. ఎన్నికలు పూర్తి కాగానే ఒక్కొక్కరి భాగోతం బయటపెడతాను, నీటి సమస్య పరిష్కరిస్తాను. ఉప్పలపాడులో సహకరిస్తున్న కార్యకర్తలను, ప్రజలను చూస్తుంటే అసలు ఈ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదనిపిస్తుంది. పాదయాత్రకు వచ్చిన జగన్ ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లారే తప్ప, ఐదేళ్లుగా జనం మొహం చూడడం మానేశారు. జగన్ ఏసీ బస్సులో తిరుగుతూ, ప్రజల్ని అవస్థల పాలు చేస్తున్నారు.’ అని ఉప్పలపాడు గ్రామంలో పర్యటిస్తూన్న సందర్భంలో పెమ్మసాని మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన వారికి డాక్టర్ పెమ్మసాని, దూలిపాళ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. * అనంతరం ధూళిపాళ్ల మాట్లాడుతూ గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు టిడిపి హయాంలో వేసిందే తప్ప ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఒక్క రోడ్డు కూడా నిర్మింపబడలేదని తెలిపారు. నీళ్లు ఇవ్వలేక సర్పంచ్, అధికారులు తిప్పలు పడుతున్నారని, నాలుగేళ్ల పది నెలలుగా చేయని నీటి సరఫరా కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. గుంటూరు ఛానల్ కు నిధులు సేకరించిందని జగన్ ప్రభుత్వం వచ్చాక తనకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఇప్పుడు రద్దుకు సిద్ధంగా ఉన్న పరిస్థితులు చూసి కూడా జగన్ స్పందించడం లేదన్నారు. కాగా పొన్నూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వడ్రానం మార్కండేయులు, పెదకాకాని మండల జనసేన అధ్యక్షుడు వెంకటరావు, టిడిపి రాష్ట్ర మైనారిటీ అధికార ప్రతినిధి మోసిఫ్, టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ తదితర టిడిపి బిజెపి జనసేన నాయకులు యావత్ పర్యటనలో పాల్గొన్నారు.
![Ponnur Roadshow at Takilapadu](https://drpemmasani.com/wp-content/uploads/2024/04/DSC01035-scaled.jpg)
Ponnur Roadshow at Takilapadu
జగన్ దెబ్బకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనిపించకూడదు. పెదకాకాని మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. చంద్రబాబు-జగన్ పాలనలో ఉన్న వ్యత్యాసం ఒకసారి గుర్తు చేసుకోండి. చంద్రబాబు పోలవరం పనులు 72% పూర్తి చేస్తే, బిల్లులు ఇవ్వలేని జగన్ దెబ్బకు కాంట్రాక్టర్లు ఇప్పుడు పారిపోతున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకాకాని మండలంలో డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలుత రోడ్ షో నిర్వహించిన తక్కెళ్ళపాడు గ్రామంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో వేసిన రోడ్లన్నీ టిడిపి హయాంలో వేసినవేనని, జగన్ వచ్చాక రోడ్లు వేయాలన్న కనీస ఆలోచన కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదని పెమ్మసాని విమర్శించారు. పోలవరం పనులకు జగన్ నియమించిన కాంట్రాక్టర్లు ఎందుకు పారిపోతున్నారో చెప్పగల ధైర్యం ఉందా అని ఈ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రానికి 11 లక్షల ఇల్లు అమలయ్యేలా చూసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనని ఆయన గర్వంగా చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జలజీవన్ మిషన్ కింద రాష్ట్రాన్ని కేటాయించిన నిధుల్లో కేవలం కడప జిల్లాకు మాత్రమే 100% ఉపయోగించారని, గుంటూరు జిల్లాకు 30 శాతం కంటే తక్కువ నిధులు ఉపయోగించడం వల్ల ఫలితం లేకుండా పోయిందని పెమ్మసాని వివరించారు. ఇలాంటి నాయకుడు, పార్టీని రాబోయే ఎన్నికల్లో దరిదాపుల్లో కనిపించకుండా ప్రజలు ఓటింగ్ చేయాలని పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. అనంతరం పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ ప్రజలకు మేలు జరగాలన్న రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్న టిడిపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం రావాలని తెలిపారు. ప్రజలంతా పరిస్థితులను గమనిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వెంకట కృష్ణాపురం పర్యటనలో పెమ్మసాని పనికిమాలిన మద్యం బ్రాండ్లు తయారు చేయడానికి జగన్ కు టైం ఉంది కానీ, ప్రజలకు మంచినీళ్లు ఇవ్వటానికి ఆతనకు టైం లేదు. గ్రామాల్లో నివసించే సామాన్యులకు తెలిసిన నీటి సమస్య ఒక సీఎం అయ్యుండి జగన్ కు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇంట్లో నుంచి కనీసం బయటకు రాని ఈ సీఎంకు ప్రజా సమస్యలు ఎలా పడతాయి? ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు తమ క్రోధాన్ని జగన్ ప్రభుత్వంపై చూపాలి. ఇతర దేశాల్లో తెలుగువారి ఖ్యాతిని ఇనబడింపజేసిన వారిలో నేనూ ఒకరిని, రానున్న రోజుల్లో గుంటూరు ఖ్యాతిని రాష్ట్ర సరిహద్దులు దాటేవరకు తెలిపేలా పనిచేస్తాను.’ అని పెమ్మసాని ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే ధూళిపాళ్ల మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో 10-12 అడుగుల పైపులు కలపడం కూడా చేతకాని నాయకులు నియోజకవర్గంలో ఉన్నారని, రు. 2.70 కోట్ల నిధులతో తమ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను తామే పూర్తి చేసి నీళ్లు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ జర్నసేన సమన్వయకర్త వడ్రాణ మార్కండేయులు, పెదకాకాని మండల జనసేన అధ్యక్షుడు వెంకట్రావు తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
![Iftar Vindh in Guntur East](https://drpemmasani.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-08-at-7.22.26-PM-scaled.jpeg)
Iftar Vindh in Guntur East
మత విశ్వాసానికి ప్రతీక రంజాన్. + ఇఫ్తార్ ధావత్ లో డాక్టర్ పెమ్మసాని ‘ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఖురాన్ ఆవిర్భవించిన ఈ పవిత్ర మాసాన్ని రంజాన్ గా ప్రవక్త ఆదేశానుసారం కఠిన ఉపవాస దీక్షలను అవలంబించడం ముస్లింల గొప్పతనం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. స్థానిక పొన్నూరు రోడ్ లోని బి కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన గుంటూరు నియోజకవర్గ ముస్లిం సోదరుల ఇఫ్తార్ ధావత్ కార్యక్రమానికి ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి రోజా విరమణ, నమాజ్, ధువా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో ఖురాన్ గురించి తాను మూడు విషయాలు తెలుసుకున్నానన్నారు. అవి ఓర్పు – సహనం, దానగుణం, కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేయడం అని వివరించారు. అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ టిడిపి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను మైనారిటీలకు చంద్రబాబు నాయుడు అందించారని, టిడిపి నాయకత్వంలో ముస్లింలకు భద్రత ఉందని తెలిపారు. దుల్హన్, రంజాన్ తోఫా వంటి అనేక కార్యక్రమాలతో ముస్లింలకు అండగా నిలబడిన టిడిపిని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
![Kapu Community Meeting](https://drpemmasani.com/wp-content/uploads/2024/04/DSC00528-1-scaled.jpg)
Kapu Community Meeting
Dr Pemmasani Chandra Sekhar has a meeting with the Kapu Community people